Wednesday 24 February 2016

మహాపాతకములు" అంటే ఏమిటి ?

అందుకు బ్రహ్మపురాణం లో వ్యాసుడిలా చెప్పాడు - పాతకాలలో ఐదింటిని "మహాపాతకాలు" అంటారు. ఆ పాపాలకు నిష్కృతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు -
స్త్రీ హత్య
శిశు హత్య
గో హత్య
బ్రహ్మ హత్య
స్వర్ణస్తేయము
ఇక బుద్ధి పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలి. అలా కాకుండా తెలియక, ప్రమాద వశాత్తూ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధనాలున్నాయి. శాస్త్ర ప్రకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఆ పాలు క్రమంగా హరిస్తాయి. ఇందుకు ఉదాహరణగా కోసల దేశపురాజు గోహత్యాపాతకంలో ఇరుక్కొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.
ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించినపుడు రాజు భీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కాని ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు. దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలోపడి మరణించింది. బావిచుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ పాపం ఎవరిదనే చర్చ సాగింది. అజాగ్రత్తగా ఉన్న పశువులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరి కొందరన్నారు. ఈ సంగతి తెలిసి రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే - రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు చెందుతుంది. అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుంది. కాని ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును. పది దినములు దీక్షతో ఉండి, పుణ్యక్షేత్రాలు దర్శించి, ఉత్తమ దానములు చేయుము - అని చెప్పారు. రాజు అలాగే చేశాడు.

పురాణాలు ఎందుకు వినాలి ?

సందేహానికి సమాధానంగా వ్యాస భగవానుడు పురాణాల గురించి ఈ విధంగా తెలియజేసాడు. సంసార బంధాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సులువైన మార్గంలో ముక్తిని ప్రసాదించ గలిగేవే ఈ పురాణములు. వేదాధ్యయనం చేయలేని వారికి సులువైన సాధన మార్గాన్ని ఉపదేశించేవి ఈ పురాణాలు. అజ్ఞానమనే అంధకారంలో అలమటిస్తున్న వారికి జ్ఞాన దీపాలు. భవరోగులకు మంచి ఔషధాలు , సకల సంపదలను కలుగాజేసేవి ఈ పురాణాలు. నిత్య పురాణ శ్రవణం చేసేవారు సాక్షాత్తూ దేవతా స్వరుపులే. పురాణాలలోని కధలను ఎవరైతే భక్తీ శ్రద్ధలతో వింటారో అలంటి వారు "కర్మ" అనుబడే సముద్రం నుండి బయటపడి భగవంతుని సన్నిధిని పొందగలరు. నిత్యం పురాణ శ్రవణం చేయలేని బలహీనులు కనీసం ఆయా పుణ్య తిధులలో నైనా ఆ ప్రయత్నం చేయాలి. సర్వ యజ్ఞ ఫలము , సర్వ దానఫలము పురాణ శ్రవణం ద్వారా కలుగుతుంది. ఈ కలియుగంలో పురాణ శ్రవణం కంటే పవిత్రమైన ధర్మం మరొకటి లేదు. ఈ పురాణాలు సకల పాపాలను నివారిస్తాయి. పురాణాలను చెప్పగలిగిన వారెవరైనా సరే వారు తప్పనిసరిగా పూజనీయులు.
పురాణ పాఠకులు పవిత్రాత్ములై ఉండాలి. దానము, శాంతము, దయ, అసూయా లేకుండుట మొదలైన గుణాలు వారిలో పుష్కలంగా ఉండాలి. మంచి మనుషులున్న చోట, నదీ తీరం, దేవాలయం మొదలైన పవిత్ర ప్రదేశాలలో మాత్రమే పురాణ పఠనం చేయాలి. పురాణ శ్రవణం సమయంలో మధ్యలో వెళ్ళిపోవటం, తలపాగా ధరించడం, తాంబూలం సేవిస్తూ ఉండటం మొదలైనవి చేయరాదు. పాపాలను హరించ గలిగిన కధలను అపహాస్యంగా చూసేవారు నీచమైన జన్మలను పొందగలరు. ఎంతో వినయంతో పూజ్య భావంతో శ్రవణం చేయాలని , ఈ విధంగా పురాణ శ్రవణ మహిమ స్కాంద పురాణంలో తెలియజేసారు.

గర్భాధారణ చేసిన స్త్రీ పాటించవలసిన నియామాలు

మానవ జీవితంలో గృహస్థాశ్రమ స్వీకారం అంటే పెళ్ళి చేసుకోవటం, ఆ తర్వాత సంతాన ప్రాప్తి ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా ధర్మబద్ధంగానే సాగాలంటున్నాయి పురాణాలు. వివాహం అనేది కేవలం సంతాన ప్రాప్తి కోసమే. సంతానం సిద్ధించటం కోసం శారీరక సుఖాన్నే లక్ష్యంగా భావించుకోకూడదు. సత్‌ సంతాన ప్రాప్తికి ముందు మంచి వ్రతాలను ఆచరించాలి. వ్రతానంతరం కేవలం గర్భదారణ కోసమే భార్యా భర్తల సంగమం జరగాలి. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ ఇక మళ్ళీ ఎవరి పరిధిలో వారు వారికి నిర్దేశించిన ధర్మబద్ధ జీవితాలను గడుపుతూ ఉండాలే తప్ప శారీరక సుఖాన్ని వాంచింఛ కూడదు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ గర్భధారణ చేసిన స్త్రీ ఎటువంటి నియమాలను పాటించాలో తెలియజేస్తుంది పద్మ పురాణం ఏడో అధ్యాయంలోని ఈ కథా సందర్భం.
పూర్వం అదితి తన భర్త అయిన కశ్యప ప్రజాపతి నుంచి సంతానాన్ని కాంక్షించింది. అదే విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజెప్పింది. అప్పుడాయన ఆమెకు పూర్ణిమా వ్రతాన్ని చేయమని తన భార్యకు చెప్పాడు. కశ్యపుడు చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని ఎంతో దీక్షగా నియమ నిష్ఠలతో చేసింది అదితి. వ్రతానంతరం కశ్యపుడు అదితి మనోవాంఛకు అనుగుణంగా గర్భదానాన్ని చేశాడు. ఆ తరువాత తాను తన విధులకు వెళుతూ అదితికి గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నిటినీ పాటిస్తూ ఉండమని, అలా అయితేనే సత్‌ సంతాన ప్రాప్తి కలుగుతుందని కశ్యపుడు చెప్పాడు.
అదితికి కశ్యపుడు గర్భిణి నియమాలను చెబుతూ సంధ్య వేళ భోజనం చేయకూడదని తొలిగా చెప్పాడు. ఆ తర్వాత చెట్ల మొదలు వద్ద నిలువ వద్దన్నాడు. అతి నిద్ర పోకూడదు. రోలు, రోకలి లాంటి వాటి జోలికి వెళ్ళ కూడదు. నీటిలోకి దిగ కూడదు. శూన్యంగా ఉన్న ఇంటిలోకి వెళ్ళ కూడదు. పుట్టలున్న చోట నిలువ వద్దు.
మనసులో ఏ విధమైన ఆందోళన చెందవద్దు. నేల మీద బొగ్గులతోనూ, బూడిదలో గోటితోనూ గీతలు గీయవద్దు. ఎప్పుడూ పడుకొనే ఉండకూడదు. బొగ్గులు, బూడిద, ఎముకలు, పుర్రెలు ఉన్న చోట కూర్చోవద్దు. అనవసర తగాదాలకు పోవద్దు. తల స్నానం చేసిన తర్వాత తల విరబోసుకొని ఉండొద్దు. అశుచిగా ఉండటం, కాళ్ళ మధ్యన తల పెట్టుకొని కూర్చోవటం, నగ్నంగా ఉండటం, ఆందోళనకు గురి కావటం, తడి కాళ్ళతో ఉండటం పనికి రావు. అమంగళకర భాషణలు చేయటం, పెద్దగా నవ్వటం లాంటివి అసలే పనికి రావు. నిరంతరం భక్తితో దైవ పూజలు చేస్తుండాలి.
స్నానానికి వాడే నీటిలో అన్ని రకాల మూలికలను వేసి ఆ నీటితోనే స్నానం చేయాలి. నిరంతరం మంచి మాటలు వింటూ కాలం గడపాలి. చిరునవ్వు ముఖంతో ఉంటూ ఉండాలి. గర్భధారణ జరిగినందువల్ల శరీరంలో వచ్చే మార్పులు కొంత అంద విహీనతను కలిగిస్తున్నప్పుడు అదంతా భర్త వల్లే జరిగిందని, భర్తను నిరసిస్తూ లేదా దూషిస్తూ ఉండటం ఏ మాత్రం మంచిది కాదు..అని కశ్యపుడు అదితికి గర్భిణి అయిన స్త్రీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్పాడు.
ఆనాటి అదితే కాదు ఈనాటి అతివలు కూడా అటువంటి జాగ్రత్తలనే తీసుకోవటం మంచిదని పద్మ పురాణం సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. పద్మ పురాణం చెప్పిన ఈ విషయాలలో ఏమాత్రమూ పనికి రానివి, ఆచరించ కూడనివి ఏవీ లేవని ఈనాటి వైద్య నిపుణులు కూడా అంటున్నారు.

పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే ఆలయం

శివ పార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు , బ్రహ్మ పంచముఖుడు, నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కాని, ఆయన ఊర్ద్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహవశమైచేష్టలుడిగి చూస్తుండిపోయింది,అది గ్రహించిన పరమ శివునికి ఆగ్రహం వచ్చింది, బ్రహ్మకు బుద్ది చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేసాడు,
మహేశ్వరుడి చేతి దెబ్బ అంటే సామాన్యమైనది కాదు కదా!దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కాని అది కింద పడలేదు,శివుడి అరచేతికి అతుక్కుపోయింది,ఎంత విదిలించిన అది ఆయన చేయిని వదలలేదు,క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది,
బ్రహ్మ అపరాధం చేశాడు ,దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది,
అయితే అది సరాసరి బ్రహ్మ హత్యా పాతకంగా పరిణమించి ,ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది,జగత్ప్రభువు,అంతటి తపశ్శాలికి ఆ పాపఫలం తప్పలేదు,దేవతలందరిని పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటొ సూచించమని పరమశివుడు అడిగాడు, " దేవాదిదేవా నీకు తెలియని ధర్మం లేదు,ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి,శాసించగలిగినవాడివి,అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మా మేధస్సు పరిమితికి తోచింది చెపుతున్నాము,ఈ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి,ఇంటింటికీ తిరుగుతూ ప్రతీచోటా నీ పాపం చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు,కొంత కాలానికి ఆ కపాలం రాలిపోవచ్చును అని చెప్పరు దేవతలు,
పరమశివుడికి ఇది ఉచితం అనిపించింది,భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుచూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు,హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నడు,అందుకు సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను,నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు,అది తెలుసుకున్న నారాయణుడు శివుడివద్దకు వచ్చి " పరమశివా నీ అధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయికదా!ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడట,
నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు, పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు,అప్పటినుండి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడా వెలిశాడు,
ఆ తరువాత శివుడు ఆయనదగ్గరకే భిక్షకు బయలుదెరాడు,ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు," పరమ శివుదే నాదగ్గరికి భిక్షకి వస్తున్నాడు,వాస్తవానికి ఇది ఆయన ఇల్లే,తన ఇంటికే ఆయన భిక్షకు వస్తున్నాడు అంటే అది ఆ మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట,ఈ అద్భుత సన్నివేశాన్ని జగత్విదితం చేయాలి,ఇది వాస్తవానికి శివక్షేత్రం,ఇందులో నేను( విష్ణువు) ఉన్నాను,ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు,చిరకాల శివ హస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్ని నశించిపోయాయి,ఇప్పుడది పరమపవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి,దానికితోడు విష్ణు శక్తి,శివ శక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని" భావిస్తు విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు, అంతే ఆ కపాలం కాస్తా ఊడి క్రిందపడిపోయి శిలామయ శివలింగరూపంగా మారిపోయింది,అప్పటినుండి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగరూపధారి అయిన బ్రహ్మకపాలం మహా క్షేత్రమైంది,తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గం అయ్యింది,..
బ్రహ్మకపాలం బదరీనాధ్‌లో వుంది. బదరీనాధ్‌లోని ఆలయం అలకనంద అనే నది ఒడ్డునే ఉంది. ఆలయం దగ్గర నుంచి నది ఒడ్డు వెంటే, పొడవుగా ఉన్న మెట్లమీదుగా నడుచుకుంటూ సుమారు 50 గజాలు వెళితే, అక్కడ నది ఒడ్డు పైన సుమారు పది అడుగుల పొడుగు, ఆరు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల మందం ఉన్న ఒక బండ ఉంది. అదే మనం చెప్పుకునే బ్రహ్మకపాలం. ఆ బ్రహ్మ కపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తే, వారికి స్వర్గప్రాప్తి కలుగు తుందని విశ్వాసం. అక్కడే ఒక రేకుల షెడ్డు ఉంది. పితృకర్మ చేయదలచు కు న్నవారిని అక్కడ ఉండే పురోహితులు, ఆ షెడ్డులో కూర్చోబెట్టి చేయించి, వారి దగ్గరి నుంచి సుమారు మూడు వందల రూపాయలు తీసుకుంటారు.

Monday 22 February 2016

యాంటీబయాటిక్స్ ‌తో మానసిక గందరగోళం ...!


బోస్టన్‌: యాంటీబయాటిక్‌ మందుల వాడకం వల్ల మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్నట్లు ఓ నూతన అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం చేసిన పరిశోధకుల బృందంలో హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త షామిక్‌ భట్టాచార్య కూడా ఉన్నారు. యాంటీబయాటిక్స్‌ వాడిన రోగుల్లో మానసిక గందరగోళం(డెలీరియం), లేనివి ఉన్నట్లు కనిపించడం, వినిపించడం, భ్రమలు కలగడం(హాలూసినేషన్స్‌) వంటి లక్షణాలు ఉత్పన్నమైనట్లు భట్టాచార్య తెలిపారు. డెలీరియం వచ్చిన వ్యక్తులు ఇంటికి వెళ్లబోయి ఆస్పత్రికి వెళ్తారని, తీవ్ర గందరగోళంలో ఉంటారని, డెలీరియం రాని రోగితో పోల్చితే ఇది వచ్చిన వారు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని భట్టాచార్య చెప్పారు. యాంటీబయాటిక్స్‌ వాడడం వల్ల డెలీరియం వచ్చిన 391 మంది రోగులపై అధ్యయనాలు చేసి.. డెలీరియం తీవ్రతను బట్టి మూడు విభాగాలు చేశామన్నారు. సల్ఫోనమైడ్లు, సిప్రోఫ్లోక్సాసిన్‌, పెనిసిల్లిన్‌, సెఫెపీం, మెట్రోనిడజోల్‌ వంటి 57 యాంటీబయాటిక్‌ మందులు, రోగుల్లో డెలీరియం లక్షణాలను కలిగించినట్లు తెలిపారు. ఈ అధ్యయనాన్ని జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ ప్రచురించింది.

Sunday 21 February 2016

బిల్వపత్ర మహత్యం.....!!


శివుడిని బిల్వపవూతాలతో పూజించుట శ్రేష్టం. బిల్వ వృక్షం సాక్షాత్తు శివ స్వరూపమని దేవతలు భావిస్తారు. ఒకసారి శనిదేవుడు శివ సందర్శన కోసం పార్వతీ-పరమేశ్వరులను భక్తితో స్తుతించాడు. అప్పుడు మహా దేవుడైన శంకరుడు శని దేవుని విధి ధర్మాన్ని పరీక్షించేందుకు ‘‘నీవు నన్ను పట్టగలవా?’’ అని ప్రశ్నిస్తాడు. అందుకు శనిదేవుడు ‘‘తమ అనుక్షిగహం ఉన్నంత వరకు నాకు అసాధ్యంమైందేదీ లేదు. తమర్ని అట్టే పట్టగలను. మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు శివుని పట్టుకోగలనని’’ శివునితో పలికాడు. శివుడు ఆ మర్నాడు ఉషోదయ కాలమందు శని నుంచి తప్పించుకోవడానికి బిల్వ వృక్ష రూపాన్ని దాల్చి.. ఆ వృక్షం నందు అగోచరంగా వశించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవాది దేవతలందరూ ముల్లోకాలను గాలించారు.
వారెవ్వరికీ పరమేశ్వరుడి జాడగానీ, శని జాడగానీ తెలియలేదు. సంధ్యా సమయానికి శివుడు బిల్వ వృక్షం నుంచి సాకార రూపంగా బయలు దేరాడు. ఆ మరుక్షణమే శని కూడా ప్రత్యక్షమయ్యాడు. శనీ నన్ను పట్టుకోలేక పోతివి! అని పరమేశ్వరుడు శనిని ప్రశ్నించాడు. అప్పుడు శనిదేవుడు నమస్కరించి ‘‘నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులైన తమరు ఈ బిల్వ వృక్ష రూపంగా వశించారు. నేనూ తమ తోడనే ఈ బిల్వవృక్షంలో అదృశ్య రూపాన నివసించాను కదా! ఐనా ఇదంతా శివలీల మహత్యమే గానీ, నా ప్రతిభ ఎంతమావూతమూ కాదు. సర్వ జగత్కర్తలైన దివ్య విభూతి ముందు నేనెంతటి వాడని ప్రభూ’’ అని విన్నవించాడు.
శని దేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన పార్వతీ వల్లభుడు శని ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలం పట్టి వశించడం చేత నేటి నుంచి నీవు శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందగలుగుతావు. అంతేకాక శని దోషం ఉన్నవారు ఆ దోష పరిహారార్థం నన్ను బిల్వ దళములతో పూజించిన వారికి దోష నివృత్తి కలుగుతుంది. బిల్వపవూతంతో పూజ చేసిన వారిని, శివ భక్తులను శనీశ్వరుడు బాధించడు’’ అని అభయ వర ప్రదానం చేశాడు శివుడు. అప్పటి నుంచి బిల్వవృక్షాన్ని శివ స్వరూపంగా భావించి పరమేశ్వరుని బిల్వ పత్రాలతో అర్చించుట ఆచారంగా వస్తుంది.

మాఘపూర్ణిమ , మహా మాఘి


ఇది విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.
ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.
తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిధే. ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.
అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.
వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పా౦డున౦దన!!
స్నానదాన జపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.
మాఘ పూర్ణిమ నాడు " అలభ్య యోగం " అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు

ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి , కొందరి ప్రాణాలనైనా కాపాడండి.

ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి , కొందరి ప్రాణాలనైనా కాపాడండి.
కేన్సర్ వస్తే తగ్గడానికి అద్భుతమైన హెర్బల్ మందులిచ్చి,
పూర్తిగా ఆ రోగాన్ని అనేకమందికి తగ్గిస్తున్న.....
దైవ సమానులైన ఆ డాక్టర్ల వివరాలు మీకు తెలియజేస్తున్నాను.
మీ మిత్రులకు , శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేయండి.
ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్న ఈ డాక్టర్ దంపతులు.....
కేరళ , కర్నాటక బోర్డర్ లో Panaje, Daithota అనె గ్రామంలో నివసిస్తున్నారు.
అక్కడికి మనం వెళ్ళగానే హడావుడిగా వారు మందులు ఇవ్వరు.
ఇచ్చే ముందు వారు అనేకానేక ప్రశ్నలు వేస్తారు
ఆతరవాతనే మందులు నిర్ణయించి ఇస్తారు. అది వారి పద్దతి.
అక్కడ బ్లడ్ కేన్సర్ తో సహా... ఎన్నో కేన్సర్లు పూర్తిగా నయమై
జీవిస్తున్న వాళ్ళున్నారు. వాలంటీర్లు గా కొన్నాళ్ళు సేవచేసి ,
మళ్లీ తమ తమ వృత్తులు ,ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నవారు
ఎంతో మంది ఉన్నారు..
వైద్యం ఖర్చుకూడా చాలా చాలా చాలా తక్కువ. నెలకు సుమారు రెండు నుంచి మూడు వేల రూపాయల లోపే అవుతుంది.
డాక్టర్ గారి పేరు 'దైతోట వెంకట రామ' Daithota Venkata Rama ,
ఆయన భార్య పేరు జయలక్ష్మిగారు.
వాళ్లకి కన్నడ ఇంగ్లీషు బాషలు మాత్రమే వచ్చు.
హాస్పిటల్ వివరాలు :
Phone timings : 2 to 3-30 pm and 6 to 9-00 pm
Dr Venkata Rama's Wife Jaya Lakshmi గారే ఫోన్లో మాట్లాడతారు.
Phone Numbers 04998 - 226296
Mobile 09481 961508
Dr P.S. Vekata Rama, (Vaidya )
Daithota, Panaje, Puttur, Daxina Kannada - Pin Code : 574259.
From Puttur, around 25 K.M.
From Kasargod Railway station 35 K.M.,
Kasargod to Perla to Panaje, Daithota,
you can reach there by Local vehicles.
Trains are there from many areas to Kasargod Railway Station.
PLEASE SHARE THIS AND SAVE SOMEONE


Saturday 20 February 2016

శ్రీ దుర్గాసప్తశ్లోకీ

శివ ఉవాచ-
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||

దేవ్యువాచ-
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే

ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |

ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || ౧ ||

దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || ౨ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || ౩ ||

శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || ౪ ||

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || ౫ ||

రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || ౬ ||

సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || ౭ ||

ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణా |

శని క్రూరదృష్టి ప్రభావాన్ని దేవతల గురువు సైతం అనుభవించాడు...

పూజలు, స్తోత్రాలు ఇన్ని చేస్తున్నాం కదా.. మరి వాటితో శనిని ఆపలేమా.. అని అనుకొనే వారు కూడా ఉంటారు. ఇలాంటి వారికి ఓ సమాధానం ఇస్తుంది సూర్య పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఉన్న శని గురుకుల వాసం అనే కథ. జాతకంలో శని ప్రభావాన్ని శనికి గురువైన బృహస్పతి ఆపగలిగాడా లేదా అని అంటే ఇదిగో ఆ కథంతా ఇలా వివరిస్తుంది.ఎంతటి వారైనా సరే... చివరకు దేవతల గురువైనా సరే.. కాలానికి అతీతంగా ఉండటం సాధ్యం కాదు. జ్యోతిష్య శాస్త్రంలో కాలానుగుణంగా శనిలాంటి గ్రహాల ప్రభావం ఉంటుంది. ఆ శని ప్రవేశాన్ని నిరోధించి హాయిగా ఉండే అవకాశం ఏదైనా లభిస్తే బాగుండునని అనుకొంటుంటారు. అలా నిరోధించటమంటే కాలాన్ని నిరోధించటమే. కాని అది సాధ్యమయ్యేది కాదు.

ఛాయాదేవికి, సూర్య భగవానుడికి జన్మించిన శని మెల్లమెల్లగా పెరిగి పెద్ద వాడయ్యాడు. విద్యాభ్యాసం చేసే వయసొచ్చింది. ఓ రోజున శని సూర్యుడి దగ్గరకు వెళ్ళి తనకు విద్యలన్నింటిలోకీ గొప్పదైన దాన్ని నేర్పే గురువెవరో చెప్పమన్నాడు. అప్పుడు సూర్యుడు బ్రహ్మవిద్యను నేర్పటంలో బృహస్పతిని మించిన వాడు మరొకరు లేరని, ఆయన గొప్పతనానికి ప్రతిఫలంగా వాచస్పతి అనే బిరుదును కూడా పొందారని అన్నాడు. బృహస్పతి తన దగ్గరకు వచ్చిన శిష్యులందరికీ అన్న వస్త్రాలను ఇచ్చి మరీ చదువు చెబుతుంటారని, కనుక ఆయన దగ్గరకు నిజ రూపంలో వెళితే ప్రవేశం దొరక్కపోవచ్చని, అందుకని ఓ బ్రాహ్మణ బాలకుడిలా మాయా రూపాన్ని ధరించి వెళ్ళమన్నాడు. తండ్రి సూచన ప్రకారం శని బృహస్పతి దగ్గరకు వెళ్లాడు. తాను కపిల మహర్షి వంశానికి చెందిన వాడినని చెప్పుకొని అక్కడ చోటు సంపాదించాడు. ఎంతో బుద్ధిగా గురువు చెప్పింది చెప్పినట్టు ఇట్టే నేర్చుకోసాగాడు. ఇతర విద్యార్థులందరికన్నా ఎంతో ముందుగా పాఠ్యాంశాలు అప్పచెప్పుతుండేవాడు.

బ్రహ్మ విద్యను అంత తొందరగా నేర్చుకున్న శిష్యుడిని చూసి ముచ్చటపడ్డ గురువు శనికి తంత్ర శాస్త్రాన్ని కూడా నేర్పించాడు. అలా విద్య పూర్తయిన తర్వాత శిష్యుడు గురువుకు గురుదక్షిణ ఇచ్చే సమయం వచ్చింది. అప్పుడు ఆ గురుశిష్యుల సంభాషణలో శిష్యుడి మాటలు, రూపంలో కపటం కనిపించటంతో గురువుకు అనుమానం వచ్చింది. అప్పుడాయన తనకు వేరే గురుదక్షిణ ఏదీ అక్కర లేదని అతడెవరో, తల్లిదండ్రులెవరో వాస్తవం చెపితే సరిపోతుందన్నాడు. అప్పుడు శని ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్పాడు. ఆ మాటలు వినగానే బృహస్పతికి గుండె ఝల్లుమంది. గురు దక్షిణగా అప్పటికప్పుడు తానొకటి అడుగుతున్నానని అది ఇవ్వమని కోరాడు. ఏం కావాలో చెప్పమన్నాడు శిష్యుడు.

తన జీవితంలో శని క్రూర దృష్టి ఎప్పుడూ తన మీద పడకూడదని, అదే తాను కోరే గురుదక్షిణ అన్నాడు బృహస్పతి. అప్పుడు శని గురువుకు నమస్కరిస్తూ అదంతా జాతకంలో కాలానుగుణంగా జరిగే వ్యవహారమని, బ్రహ్మ రాసిన రాత అనుగుణంగా జరుగుతూ ఉంటుందని, తన ప్రవేశాన్ని జాతకంలో నిరోధించటం సాధ్యపడదని అన్నాడు. అయితే తన ప్రభావం ఉన్న రోజుల్లో తనను పూజించటం, అర్చించటం వల్ల చెడు పరిణామాల నుంచి తప్పించుకోవచ్చని అన్నాడు. బృహస్పతి జాతకంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు తన ప్రభావం ఉంటుందని, దానివల్ల కష్టాలు కలుగుతాయని, అయితే అప్పుడు అధైర్యపడక తనను స్మరిస్తే తాను ఆ ఆపదలను పోగొడతానని చెప్పి అంతర్ధానమయ్యాడు శని.

ఆ తర్వాత బృహస్పతి ఏదో లెక్కలు కట్టి తన జాతకంలో ఏ గ్రహ ప్రభావం ఎప్పుడు ఉంటుందోనని కొంతకాలం పాటు చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత మామూలుగానే కాలం గడపసాగాడు. ఇంతలో ఆ గురువు జాతకంలో శని ప్రవేశించాడు. ఓ రోజున ఆయన పూజా ద్రవ్యాల కోసం అడవికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక పెద్ద పూల బుట్టలాంటిది తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అదే సమయానికి వీరబాహువు అనే రాజు కూడా ఆ అడవికి వేటకొచ్చాడు. ఆ రాజు తన వెంట పసివాడైన తన కుమారుడిని కూడా తెచ్చుకున్నాడు. ఒకచోట ఉయ్యాల కట్టించి ఆ ఉయ్యాలలో రాకుమారుడిని ఉంచి సైనికులను చుట్టూ కాపలా ఉంచి వేట ప్రయత్నంలో ఉన్నాడు వీరబాహువు. కాసేపాగి చూసేసరికి ఉయ్యాలలో బాలుడు కనిపించలేదు. అన్ని చోట్లా వెతికిస్తుంటే పువ్వులు కోసుకుని ఆశ్రమానికి వెళుతున్న బృహస్పతి సైనికుల కంటపడ్డాడు. ఆయన చేతిలో ఉన్న పెద్ద పూల సజ్జ నుంచి రక్తపు బొట్లు పడుతున్నాయి. సైనికులు ఆయనకు నమస్కరించి అదేమిటని అడిగారు.

బృహస్పతి బుట్టలో చూసేసరికి గొంతు తెగిన పసి బాలుడు ఉన్నాడు. అదంతా ఏమిటో తనకర్థం కావటం లేదని గురువు అన్నాడు. భటులు రాజుకు విషయమంతా చెప్పారు. మంత్రి మండలి బృహస్పతి ఉత్తముడని, అలాంటి నీచకార్యం చేశాడంటే తాము నమ్మలేక పోతున్నామన్నారు. అయినా సాక్ష్యం ఉంది కనుక శిక్ష తప్పదు కదా అని అనుకొనేంతలో బృహస్పతికి శని విషయం గుర్తుకొచ్చింది. వెంటనే శనిని స్తుతించాడు. అప్పుడాయన అక్కడ ప్రత్యక్షమై రాజుకు విషయం వివరించి తన ప్రభావం వల్లనే అలా జరిగిందని గురువును శిక్షించక సత్కరించి పంపించమన్నాడు. తన మాట ప్రకారం నడుచుకొని తనకు పూజలు చేస్తే ఆ రాజుకు, ప్రజలకు మేలు జరుగుతుందన్నాడు. రాజు శనీశ్వరుడి ఆజ్ఞను అనుసరించాడు. ఈ కథా సందర్భంలో కాలచక్రంలో కష్టసుఖాలనేవి తప్పవని, అయితే కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి దైవ పూజలు, స్తుతులతో దైవబలాన్ని పొంది కష్టాలను అధిగమించాలన్న ఓ సూచన కనిపిస్తుంది.


Thursday 18 February 2016

ప్రదక్షిణ సమయంలో ఏ మంత్రాలు ఉపయోగిస్తారు - ఎన్నిసార్లు ప్రదక్షిణం చేయాలి....!!

సాధారణంగా దేవాలయంలో 3 సార్లు, ఆంజనేయునికి 5 సార్లు, విష్ణు ఆలయాలలొ 4 సార్లు, ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడుల ప్రకారం 11, 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలను చదువుకోవాలి.
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
పాపోయం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః!
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల!!
అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర!!
శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకాలలో దేవకు బదులుగా దేవి; శరణాగత వత్సలకు బదులుగా శరణాగత వత్సలే;
మహేశ్వరకు బదులుగా మహేశ్వరి అని మార్చి చదువుకోవాలి.
ఈ శబ్దాలు ఏ శక్తి దేవతకైనా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణువుకైనా, శివునకైనా, ఇతర దైవానికైనా చెప్పవచ్చు.
"శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ "
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం!
తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం!!
మర్కటేశ మహోత్సాహ సర్వశోకవినాశక!
శత్రున్ సంహర మాంరక్ష శ్రీయమాయుశ్చ దేహిమే!! అని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తులసిని నమస్కరించేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు సంప్రదాయంగా చదివే శ్లోకం ఇది.
యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా!
యదగ్రే సర్వ వేదాంశ్చ తులసీం త్వాం నమామ్యహం!!

తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు...!

అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. 
అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
తెలుగు సంవత్సరాలు, ఆయనములు,ఋతువులు, మాసములు,తిధులు
మన తెలుగు సంవత్సరాల పేర్లు :
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది....ఆయనములు 2:అవి...
ఉత్తరాయణము :
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం :
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.
సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది...అందుకే ఋతువులు ఆరు... 
వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర
సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది...అందుకే
మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)
పక్షములు 2 :
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.. అవి
పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు...
ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడానమోదు చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..
ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు... మనకు అసలైన నూతన సంవత్సరం.. ఉగాదే.. ఇప్పటినుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది... పంచాగం మొదలవుతుంది.. సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే ఉగాది అయింది.. ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి.. క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది... అందుకే ఇది ప్రతి ఒక్కరిలో నూతనత్వానికి నాంది పలకి.. నిత్య నూతన ఆశలతో క్రొత్త సంవత్సరం ప్రారంభమవ్వాలని.. అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు.!!
వారములు 7 :
ఆదివారం - భానువాసరే
సోమవారం - ఇందువాసరే
మంగళవారం - భౌమ్యవాసరే
బుధవారం - సౌమ్యవాసరే
గురువారం - గురువాసరే
శుక్రవారం - భృగువాసరే
శనివారం - స్థిరవాసరే / మందవాసర

లక్ష్మీదేవి నామాన్ని నిత్యం స్మరిస్తూ వుంటే.....!!

లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ వుండటం ద్వారా ఆ దేవదేవి అనుగ్రహం లభిస్తుంది. నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేసే వారింట ఆ తల్లి స్థిరనివాసం చేస్తుంది. సాధారణంగా లక్ష్మీదేవి చంచలమైన మనసును కలిగి ఉంటుందనీ, అందువలన ఒకచోట కుదురుగా ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుందని అనుకుంటూ వుంటారు. నిజానికి లక్ష్మీదేవి స్వభావం అది కానేకాదు.
ధర్మబద్ధమైన పవిత్రమైన జీవన విధానాన్ని చూసి, సంప్రదాయబద్ధమైన పద్ధతులను చూసి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. ఏవైతే మంచి లక్షణాలను చూసి అమ్మవారు అక్కడ ఉందామని అడుగుపెడుతుందో, ఆ తరువాత ఆ ఇంట్లోని వ్యక్తులు అమ్మవారికి ఇబ్బంది కలిగించేలా ఆ లక్షణాలను మార్చుకున్నప్పుడు సహజంగానే ఆమె ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోతుంది.
లక్ష్మీదేవి రావడం, తిరిగి వెళ్లిపోవడనేది పూర్తిగా ఆ ఇంట్లోవాళ్లు నడచుకునే విధానంపై మాత్రమే ఆధారపడి వుంటుంది. లక్ష్మీదేవి స్థిరనివాసం చేయాలంటే పవిత్రమైన జీవనవిధానానికి భంగం కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవిని అనునిత్యం పూజిస్తూ, సేవిస్తూ, ఆమె నామాన్ని స్మరిస్తూ ఉంటే సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పండితులు సెలివిస్తున్నారు.

Wednesday 17 February 2016

భీష్మ ఏకాదశి


శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పారేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.

గంగా(నది) దేవికి, శంతన మహారాజుకు జన్మించిన అష్టమ సంతానం దేవవ్రతుడు. వసిష్ఠుడి-పరశురాముడు దగ్గర అన్ని విద్యలూ నేర్చుకుని బుద్ధిలో
బృహస్పతితో సముడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి శంతనుడు ఒక రోజు తాను దాశరాజు కుమార్తె అయిన సత్యవతి మీద మనసు పడినట్లు చెప్పాడు.
ఆమెకు కలిగిన సంతానానికి రాజ్యార్హత కల్పిస్తేనే సత్యవతి తనకు సొంతమవుతుందని చెప్పాడు. తండ్రి అంతరంగం అర్థం చేసుకున్న దేవవ్రతుడు- ఆయన కోరిక తీర్చడంకోసం తాను వివాహం చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ క్షణంనుంచీ అతడి పేరు ‘భీష్ముడు’గా మారింది. కొడుకు త్యాగాన్ని మెచ్చుకున్న తండ్రి అతడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ప్రసాదించాడు.
సత్యవతికి శంతనుడి ద్వారా చిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు అని ఇద్దరు బిడ్డలు కలిగారు. చిత్రాంగుడు గంధర్వులతో యుద్ధం చేస్తూ మరణించాడు. విచిత్ర
వీర్యుణ్ని రాజుగా చేసి అంబిక, అంబాలిక అనే ఇద్దరు బాలికలనిచ్చి వివాహం చేశాడు భీష్ముడు. సంతానం కలగకుండానే అతడు మరణించాడు. తమ వంశం
నిర్వంశం కాకూడదనే సంకల్పంతో పినతల్లి సత్యవతి, భీష్ముణ్ని పిలిచి, అతడి తమ్ముడి భార్య(అంబిక, అంబాలిక)లను సంతానవతులుగా చేసి వంశాన్ని
నిలబెట్టమని కోరింది. అలా చేస్తే తన ప్రతిజ్ఞకు భంగం కలిగి తన సంతానమే రాజ్యమేలుతుందనిపించి నిరాకరించాడు భీష్ముడు. అయినప్పటికీ ఆ వంశం
నిలబడటానికి వేదవిదుడైన వ్యాసుడి ద్వారా వారిని సంతానవతులు చేయించాడు. ఆ సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు.
కురు పాండవుల మధ్య రాజ్యార్హత విషయంలో శత్రుత్వం ఏర్పడింది. అలా పెరిగిన వైరం కురుక్షేత్ర యుద్ధం వరకు దారి తీసింది. ఎవరికీ ఇష్టం లేకపోయినా
బంధువులు, మిత్రులు, పరివారం అంతా ఇరు వర్గాలుగా విడిపోక తప్పలేదు. భీష్ముడు కౌరవపక్షం వహించాడు. నిష్పక్షపాతంగా, చిత్తశుద్ధితో,
ధర్మబద్ధంగానే యుద్ధం చేశాడు. కాని ఆయన పాండవ పక్షపాతం చూపుతున్నాడని అపనమ్మకం ఏర్పడింది కౌరవులకు. అందుకే సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పుకొమ్మన్నాడు దుర్యోధనుడు. అయినా కౌరవుల క్షేమం కోరి తప్పుకోలేదతడు. పాండవసేనలో పరిస్థితి ఇంకోలా ఉంది.
భీష్ముడు కౌరవ పక్షంలో ఉన్నంతసేపూ వారిని జయించడం తమవల్ల కాదనే నిశ్చయానికి వచ్చారు. అందుకే రహస్యంగా కలిసి జయించే మార్గం చెప్పమని ఆయననే ప్రార్థించారు. తాను కావాలి అనుకుంటున్నవాళ్లు, తనకు కావాలనుకున్నవాళ్లు ఇద్దరూ తనను వద్దనుకుంటున్నారు. కాబట్టి నిష్క్రమించాలని నిశ్చయించుకుని మార్గం
సూచించాడు.
ఆ మేరకు శిఖండిని యుద్ధరంగాన ఆయనకు ఎదురుగా నిలిపారు పాండవులు. యుద్ధభూమిలో శిఖండిని చూస్తూనే అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. అదే
అదనుగా అర్జునుడు వేసిన బాణపు దెబ్బకు కూలిపోయాడు. అంతటి మహానుభావుడు నేలమీద పడరాదని తలచి అప్పటికప్పుడు బాణాలతో అంపశయ్య ఏర్పరచాడు అర్జునుడు. దానిపై మేను వాల్చిన అతడికి అది దక్షిణాయణమని గుర్తొచ్చింది. కొద్దిరోజుల్లో ఉత్తరాయణం రాబోతోందని, అప్పుడు తనువు చాలిస్తే కైవల్యం సంభవిస్తుందని అలా తండ్రి ఇచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకుని మరణాన్ని నియంత్రించుకున్నాడు.
ఉత్తరాయణంలో మాఘ శుక్ల ఏకాదశి నాడు తన తనుత్యాగానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. మాఘ శుక్ల సప్తమి మొదలుకుని రోజుకొక ప్రాణం చొప్పున విడుస్తూ ఏకాదశి నాటికి విష్ణువులో లీనమైపోయాడని, అందువల్ల ఆ అయిదు రోజులను భీష్మ పంచకం అంటారని మహాభారత కథనం. పై కథనం ఆధారంగా భీష్ముడి నిర్యాణ దినాన్ని భీష్మ ఏకాదశిగా జరుపుతారు.
ధర్మనిరతుడు, కర్మయోగి, ఆదర్శ పురుషుడైనందువల్లే భీష్ముడి నిర్యాణ దినం లోకానికి స్మరణదినమైంది.

మాఘమాసం శుద్ధ ఏకాదశి మొదలు పౌర్ణమి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మపంచకం అని అంటారు. ఈ ఐదు రోజులు ప్రాతస్నానమాచరించి స్నానాంగముగా భీష్మాచార్యులకు నీటితో అర్ఘ్యము ఇవ్వవలయును అర్ఘ్యమంత్రము 1 ంభీష్మ: శాంతనవో వీర: సత్యవాదీ జితేంద్రియ: 1 ఆధిరద్భిరవాప్నోతి 
పుత్రపౌత్రోచితాం క్రియాం 1 వైయాఘ్రపదగోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ1 అపుత్రాయ దదామ్యేతత్ జలం భష్మాయ వర్మిణే 11అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే 1వసూనా మవతారాయ శంతనో రాత్మజాయ చ 11









బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం.....!!

1. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్
త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్
2. త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైః
తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్
3. సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్య పాలనమ్
సర్వత్రైలోక్య హర్తారమ్ ఏక బిల్వం శివార్పణమ్
4. నాగాధిరాజవలయం నాగహారేణభూషితమ్
నాగకుండలసంయుక్తమ్ ఏక బిల్వం శివార్పణమ్
5. అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభమ్
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్
6. త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్
విభూత్యభ్యర్చితం దేవం ఏక బిల్వం శివార్పణమ్
7. త్రిశూలధారిణం దేవం నాగాభరణసున్దరమ్
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్
8. గఙ్గాధరామ్బికానాథం ఫణికుణ్డలమణ్డితమ్
కాలకాలం గిరీశం చ ఏక బిల్వం శివార్పణమ్
9. శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిమ్
సర్వేశ్వరం సదాశాన్తమ్ ఏక బిల్వం శివార్పణమ్
10. సచ్చిదానన్దరూపం చ పరానన్దమయం శివమ్
వాగీశ్వరం చిదాకాశం ఏక బిల్వం శివార్పణమ్
11. శిపివిష్టం సహస్రాక్షం కైలాసాచలవాసినమ్
హిరణ్యబాహుం సేనాన్యమ్ ఏక బిల్వం శివార్పణమ్
12. అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తవమ్
జ్యేష్టం కనిష్ఠం గౌరీశమ్ ఏక బిల్వం శివార్పణమ్
13. హరికేశం సనన్దీశమ్ ఉచ్ఛైర్ఘోషం సనాతనమ్
అఘోరరూపకం కుంభమ్ ఏక బిల్వం శివార్పణమ్
14. పూర్వజావరజం యామ్యం సూక్ష్మ తస్కరనాయకమ్
నీలకంఠం జఘంన్యంచ ఏక బిల్వం శివార్పణమ్
15. సురాశ్రయం విషహరం వర్మిణం చ వరూధినమ్
మహాసేనం మహావీరమ్ ఏక బిల్వం శివార్పణమ్
16. కుమారం కుశలం కూప్యం వదాన్యఞ్చ మహారధమ్
తౌర్యాతౌర్యం చ దేవ్యం చ ఏక బిల్వం శివార్పణమ్
17. దశకర్ణం లలాటాక్షం పఞ్చవక్త్రం సదాశివమ్
అశేషపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్
18. నీలకణ్ఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరమ్
మహాపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్
19. చూడామణీకృతవిభుం వలయీకృతవాసుకిమ్
కైలాసవాసినం భీమమ్ ఏక బిల్వం శివార్పణమ్
20. కర్పూరకుందధవలం నరకార్ణవతారకమ్
కరుణామృతసింధుం చ ఏక బిల్వం శివార్పణమ్

వాస్తు పూజ తప్పక ఆచరించవలసిన విధి

భూమి కొనేటప్పుడు, ఇల్లు కట్టించేటప్పుడు వాస్తు చూడటమనేది చాలామంది చేస్తుంటారు. అసలీ వాస్తు అంటే ఏమిటి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది.. అనే విషయాలను గురించి చెబుతుంది మత్స్య పురాణం రెండువందల యాభై ఒకటో అధ్యాయం పూర్వం సూతుడు రుషులకు భవన నిర్మాణానికి సంబంధించిన విషయాలను వివరిస్తూ వాస్తు పురుష ఉత్పత్తి, వాస్తు శబ్ధ అర్ధం, భూమి పరీక్ష లాంటివి వివరించాడు.
పూర్వం అంధకాసుర వధ సమయంలో శివుడి నుదిటి భాగం నుంచి ఒక చెమట బిందువు రాలి పడింది. క్షణాల్లో ఆ బిందువు భయంకరమైన భూతంలా మారింది. పుట్టీ పుట్టగానే ఆ భూతం తన ఎదురుగా ఉన్న అంధకాసురుడికి చెందిన అంధకులు అందరినీ తినేసింది. అయినా ఆ భూతానికి ఆకలి తీరలేదు. వెంటనే అది తన ఆకలి తీర్చమని శివుడిని గురించి భీకరమైన తపస్సు చేసింది. చాలాకాలం పాటు ఆ తపస్సు సాగాక శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ భూతం తనకు మూడు లోకాలను మింగేసి ఆకలి తీర్చుకోవాలని ఉందని అంది. శివుడు అలాగే కానిమ్మన్నాడు.
పురుషాకృతిలో ఉన్న ఆ భూతం మూడు లోకాలకు విస్తరించింది. అందిన వారిని అందినట్లు నమిలేసింది. అయితే ఇంతలో లోకాలన్నిటా ఉన్న మానవులు, దేవతలు, రాక్షసులు అంతా ఆ భూతం మీదకు ఎక్కి కుర్చొని దాన్ని అణిచి వేసారు. అంతమంది ఎక్కి కదలనివ్వక పోవటంతో అది మళ్ళీ దీనంగా దేవతలను ఉద్దేశించి ఇలా సర్వలోకవాసులు తనను అణిచి వేస్తున్నారని, తాను బతకటానికి ఆహారం కావాలి కనుక ఏదైనా ప్రసాదించమని వేడుకొంది. ఆ భూతం మీద అందరూ వాసం ఏర్పరచుకున్నారు. కనుక అది అందరికీ వాస స్థానం అయింది. ఆనాటి నుంచి దానికి "వాస్తు" అని పేరొచ్చింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు దాన్ని అనుగ్రహిస్తూ ఇలా అన్నారు.
గృహస్తుడు తన ఇంట్లో అగ్ని కార్యం చేసి ఇంటి మధ్యలో వేసే బలి (అన్నం లాంటి పదార్ధాలు), అలాగే వాస్తు ఉపశమనం కోసం చేసే యజ్ఞంలో లభించే హవిస్సులు యజ్ఞ, ఉత్సవాల వంటి సమయాలలో వేసే వాస్తు బలి (అన్నం), వాస్తు పూజ ఆచరించని వాడు, అజ్ఞానంతో చేయాల్సిన పద్ధతిలో కాక తప్పు పద్ధతిలో యజ్ఞాలు చేసే వాడు వాస్తు పురుషుడికి ఆహారం అవుతారని బ్రహ్మాది దేవతలు పలికారు. అప్పుడు ఆ వాస్తు పురుషుడు ఆనందించాడు. నాటి నుంచి ఎక్కడ శాంతి పూజలు జరిగినా వాస్తు పూజ, హోమం లాంటివి చేయడం ఆచారంగా వస్తోంది. ఈనాటికీ సంప్రదాయబద్ధంగా చేసే ఉత్సవాలు, బ్రహోత్సవాల వంటి వాటిలో చేసే యజ్ఞయాగాలు ఇలా అనేక సందర్భాలలో వాస్తు పూజ, బలి ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి. గృహ నిర్మాణ, గృహ ప్రవేశాది విషయాలలో దీన్ని నిర్వహించటం కనిపిస్తుంది.

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

యంత్రములు - ఫలితాలు....!!

యంత్రము అనగా ముందుకు వెళ్లేవి, ముందుకు నడిపించునవి అని అర్ధం. అంటే ఎవరైతే ఒక దైవ యంత్రాన్ని ఆరాధిస్తూ ఉన్నారో వారికి భగవ దానుగ్రహం కలిగించును. అమ్మవారి లలితా సహస్రనామాలకు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసనా లని అమ్మవారి నామాలకి చెప్పబడుచున్నది అంటే అన్ని యంత్రములకు ప్రతినిధి అమ్మవారే.
ఇక భగవంతుని ప్రాణ శక్తి యంత్రరూపంగా ఉంటుంది. ఏ దేవాలయం నిర్మాణం జరిగినా ధ్వజస్ధంబం నిలబెట్టినా, దేవతా విగ్రహం ప్రతిష్టకంటే ముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. కారణం యంత్రానికి ఉండే అమోగమైన శక్తి ఆ దేవతామూర్తిలో ప్రవేశించి అమోగమైన చైతాన్యాన్ని కల్గిస్తున్నది. భారతదేశమున ఆది శంకరాచార్యుల వారు అనేక దైవక్షేత్రాలలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన చేయబట్టి లోకం అంతా శాంతి సుభిక్షాలతో పాడిపంటలతో వర్ధిల్లిచున్నది అటువంటి శక్తి ఒక యంత్రానికి ఉన్నది.
అయితే అట్టి యంత్రాలు ఏమేం రకాలు ఉన్నాయో వాటి ప్రయోజనములు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
యంత్రములు ప్రయోజనములు
సంకటహరగణీశయంత్రము సర్వకార్యసిద్ధి
కుబేరయంత్రము ధనప్రాప్తి,ఆరోగ్యము
శ్రీ లక్ష్మీ గణేశ యంత్రము ధనప్రాప్తి
అష్ట లక్ష్మీ యంత్రము సౌభాగ్యము
వ్యాపారాకర్షణ యంత్రము సకలవ్యాపారవృద్ధి
స్ధిర లక్ష్మీ యంత్రము ధనము స్ధిరమగును
సౌభాగ్య లక్ష్మీ యంత్రము సౌభాగ్యప్రాప్తి
మహసౌర యంత్రము ఆరోగ్యసిద్ధి
నవగ్రహ యంత్రము నవగ్రహశాంతి
సర్వకార్య సిద్ధి యంత్రము కార్యసిద్ధి
మన్యు యంత్రము శతృపలాయనము.
మృత్యుంజయ యంత్రము అపమృత్యు భయనివారణ
ధన్వంతీరా యంత్రము ఆరోగ్యసిద్ధి
మహకార్తికేయ యంత్రము శతృజయం
మహ సుదర్మన యంత్రము ఆరోగ్యము,భయనివారణ
వాహనదుర్ఘటన నివారణ యంత్రము వాహనరక్షణ,వాహనసౌఖ్యము
నరగోష నివారణ యంత్రము దృష్టిదోష,నరగోష నివారణ
సరస్వతీ యంత్రము విద్యా ఉన్నతి
సంతాన గోపాల యంత్రము సంతానప్రాప్తి
కళ్యాణ గౌరీ యంత్రము వివాహప్రాప్తి
జనాకర్షణ యంత్రము సర్వజనవశ్యము
ధనాకర్షణ యంత్రము ధనప్రాప్తి
విద్యాభివృద్ధికర యంత్రము సర్వవిద్యాభివృద్ధి
ఉద్యోగప్రాప్తి యంత్రము ఉద్యోగప్రాప్తి
మత్స్య యంత్రము గృహదోషశాంతి
వాస్తుదోషహర యంత్రము వాస్తుదోష నివారణ
కూర్మ యంత్రము వాస్తుదోష నివారణ
అష్ట ధిక్పాలక యంత్రము దృష్టి దోషాది శాంతి
కార్యసిద్ధి యంత్రము సర్వకార్య సిద్ధి
మంగళ యంత్రము కుజదోష నివారణ
లక్ష్మీ ప్రాప్తి యంత్రము ధనాభివృది.
కనక ధారా యంత్రము ఐశ్వర్యప్రాప్తి
వైభవ లక్ష్మీ యంత్రము సర్వశుభకార్యసిద్ధి
కాత్యాయనీ యంత్రము వివాహప్రాప్తి
గాయత్రి యంత్రము సద్బుద్ధిప్రసిద్ధి
దుర్గా సప్తశతీ యంత్రము జగన్మాత అనుగ్రహం ఉపాసనాసిద్ధి
రామ రక్షా యంత్రము సర్వదా రక్షణ
శతృ విజయ యంత్రము కార్యజయం
పుత్రే వివాహ యంత్రము వివాహ ప్రాప్తి
దత్తాత్రేయ యంత్రము దుష్టగ్రహబాధా నివారణ
సాయిరక్షా యంత్రము బాబా అనుగ్రహం
గర్భ ధారణ యంత్రము సంతాన ప్రాప్తి
సర్వకార్య సిద్ధి యంత్రము కార్య సిద్ధి
బీసా యంత్రము విదేశీయానం
స్వస్తిక్ యంత్రము శుభప్రాప్తి
విజయ యంత్రము సర్వత్రావిజయం
శారదా యంత్రము విద్యాసక్తి

నాగదోషానికి ఎలాంటి తిథుల్లో పూజలు చేయాలి.....!!

నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.
నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారం, ఆదివారం విశిష్టమని వారు సూచిస్తున్నారు.
అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.

పాదరస ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి....!!

త్రేతాయుగంలో ధర్మస్థాపన కొరకు విష్ణుమూర్తి, శ్రీరామచంద్రునిగా అవతరించాడు. మహాశివుడేమో ఆంజనేయునిగా అవతరించి, శ్రీరామునికి ప్రతి పనిలో, ప్రతి క్షణమూ సహకరించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు అత్యంత బలవంతుడు. తనను నమ్మిన భక్తులను ఆపదల నుండి రక్షించే దయాహృదయుడు.
ఆంజనేయుని ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. ఆంజనేయుని ఇతర రూపాల కంటే పాదరస హనుమంతుని రూపం మరింత పవిత్రమైనది. మంగళవారం లేదా శనివారం హనుమంతునికి ప్రీతికరమైన రోజు కనుక ఆ రెండురోజుల్లో ఏదో ఒక రోజున పాదరస హనుమంతుని పూజించినట్లయితే శుభం కలుగుతుంది. అక్షయ తృతీయ కూడా పాదరస హనుమంతుని పూజకు శ్రేష్టమని పురోహితులు చెబుతున్నారు.
పాదరస హనుమంతుడికి ఎలాంటి పూజ చేయాలంటే.....?
పాదరస హనుమంతునికి పూజ చేద్దామనుకుంటే, ముందు రోజు రాత్రిపూట తలస్నానం చేయాలి. పూజకు సిద్ధం చేసుకున్న గదిని రాత్రి పూటంతా మూసి వుంచకండి. అలా తెరిచి ఉంచిన గది గడపమీద ఎర్రటి వస్త్రం పరచి, పాదరస హనుమంతుని ఉంచాలి. మనసులో భక్తిగా హనుమంతుని స్మరించుకోవాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో పూజించాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి చదువుతూ, పూవులు, అక్షింతలు, సింధూరం జల్లుతూ భక్తిశ్రద్దలతో పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు, తాంబూలం సమర్పించాలి.
'' ఓం నమో హనుమతే రుద్రావతరాయ
పరయంత్ర మంత్ర తంత్ర తాటక నాశకాయ
సర్వ జ్వరచ్చేద కాయ, సర్వ వ్యాధి నికృంతకాయ
సర్వభయ ప్రశమనాయ, సర్వ దృష్టి ముఖ స్తంభనాయ
దేవ దానవ యక్ష రాక్షస భూతప్రేత పిశాచ
ఢాకినీ శాకినీ దుష్టగ్రహ బంధనాయ
సర్వ కార్య సిద్ధిప్రదాయ రామ దూతాయ స్వాహా..''
అనే మంత్రాన్ని జపించాలి.
మంత్రజపం ముగిసిన తర్వాత, క్షమామంత్రం చదివి, పూజలో ఉంచిన అక్షింతలు భక్తిగా తలపై జల్లుకోవాలి. పాదరస పూజ పూర్తయిన తర్వాత భోజనం చేసి బ్రహ్మచర్యం పాటించాలి.
గడప మీద ఉంచిన ఆంజనేయ విగ్రహాన్ని ఆ రాత్రి అలాగే ఉంచాలి. దీపం రాత్రంతా వెలుగుతూ ఉండాలన్న నియమం ఏమీ లేదు. ప్రమిదల్లో నూనె ఉన్నంతవరకూ వెలుగుతూ ఉంటాయి. ఇక మరుసటి రోజు మంగళవారం లేదా శనివారం లేదా అక్షయ తృతీయ అనుకోండి... ఆవేళ పొద్దున్నే లేచి, స్నానం చేసి ఆంజనేయుని ముందు దీపారాధన చేయాలి. ముందురోజు రాత్రి చేసినట్లే షోడశోపచారాలతో భక్తిగా పూజ చేయాలి.
ఇంతకుముందు స్మరించిన
''ఓం నమో హనుమతే రుద్రావతరాయ "
మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఏ దుష్ట శక్తులు మన దరికి చేరకూడదని, ఆపదలుండ కూడదని, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని భక్తిగా ప్రార్థించాలి. చివరికి శాంతి మంత్రాన్ని చదువుకోవాలి. పూజలోని అక్షింతలు శిరస్సుపై జల్లుకుని, ఆంజనేయునికి ఉద్వాసన చెప్పి, గడపపై నుండి ఆంజనేయుని విగ్రహాన్ని తొలగించి, పూజామందిరంలో ప్రతిష్టించుకోవాలి.
పాదరస ఆంజనేయుని విగ్రహాన్ని పూజా మందిరంలో స్థాపించిన రోజు నుండి, రోజూ చేసే నిత్య పూజ తర్వాత ఇందాక చెప్పుకున్న ''ఓం నమో హనుమతే రుద్రావతరాయ....'' మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించుకోవాలి. ఇలా కనుక చేస్తే ఇక ఏ భయాలూ, భీతులూ మన చెంతకు రావు. మనసు నిబ్బరంగా ఉంటుంది. జీవనం సుఖంగా, సంతోషంగా గడుస్తుంది.

నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని 9 సార్లు పఠిస్తే......!!

నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ప్రతీరోజూ ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.
గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవిః
రోహిణీ శస్సుధామూ ర్తిస్సుధాగాత్రస్సురాళనః
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః
ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః
దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భృగుః
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః
మహాశిరామ మహావక్తోృ దీర్ఘదంష్టోృ మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ
అనేక రూప్వర్యైశ్చశతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమంతుడు ....!!

హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.
సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు ... ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.

సమస్యలు - పరిష్కారం

గురుబలం తక్కువగా ఉన్నవారు ఏం చేయాలి.....!!
గురుబలం తక్కువగా ఉన్నప్పుడు పాలతో తడిపిన పసుపును నుదుట ధరించడం వల్ల గురుబలం పెరుగుతుంది

 పైల్స్, పుండ్లు, దీర్ఘవ్యాధులు ఉపశమనం కోసం....!!
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, స్వామి వారిని ధ్యానించడం, పసుపు ఎరుపు రంగుల పూలమాల ప్రతి మంగళ, శనివారాలు వేసి ధ్యానం చేయడం ద్వారా పైల్స్, పుండ్లు, దీర్ఘవ్యాధులు ఉపశమిస్తాయి.

శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటె....!!
శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే, వారి చేస్తున్న ఆటంకాలను అధిగమించాలంటే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి.

భర్తకు వీసా రావడానికి భార్య చేయాల్సిన వ్రతం.....!!
41 రోజులు దీక్షగా హనుమంతుడికి 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి మంగళవారం ప్రదక్షిణతో పాటు తమలపాకుల దండను సమర్పించాలి.

తల్లి దండ్రుల పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయా....!!

మనం ఒకోసారి వింటూ ఉంటాము. ఏ జన్మలో ఏ పాపం చేసానో.ఈ జన్మలో ఈ రోగం తో బాధ పడుతున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేసానో ఈ జన్మలో ఇలాంటి భర్త / భార్య దొరికాడు / దొరికింది. తెలిసి నేను ఏ పాపమూ చెయ్య లేదు అయినా నా కెందుకీ శిక్ష వేసాడు దేవుడు.
ఇలాంటి మాటలు వింటూ ఉంటాము. మరి చెయ్యని పాపాలకు వాళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే కారణం మూడు తరములనుండి వారికి ఆనువంశికంగా వస్తున్న పాప పుణ్యాలు అని చెప్పుకోవచ్చు.
తాను గత జన్మ లో చేసిన పాప పుణ్యాలు మాత్రమే కాదు; ఈ జన్మలో తన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసిన పాప పుణ్యాలు కూడా జీవికి ఆనువంశికంగా వస్తాయి అనే చెబుతోంది ధర్మ శాస్త్రం.
కనిపించే ఆస్తి పాస్తులు; ధన - ధాన్యాలు; వస్తు - వాహనాలు ఎలాగో కనబడనివి పాప పుణ్యాలు. కనిపించే ఆస్తి పాస్తులు తర తరాలనుండి ఎలా సంక్రమిస్తున్నాయో కనబడని పాప పుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయి అని చెబుతోంది ధర్మ శాస్త్రం. వారి ఆస్తి మాకు వద్దు, వారి పాప పుణ్యాలు మాకు వద్దు అన్నంత మాత్రాన ఇవి పోవు. ఎందుకంటే ఈ శరీరమే తల్లిదండ్రులు, తాత ముత్తాతల ప్రసాదమైనప్పుదు ఈ శరీరానికి అంటిన ఆ పాపాలు అంత సులభంగా పోవు..
అలా పోవాలంటే ప్రస్తుత జన్మలో నిత్యం భగవన్నామ స్మరణ చేయాలి; ఉన్నంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయాలి. పుణ్య నదులలో స్నానాదులు చెయ్యాలి, తీర్ధ యాత్రలు చెయ్యాలి. చేసిన పాపాలకుపశ్చాత్తాపం చెందాలి. ప్రస్తుత తరం పాపాలు భవిష్యత్ తరాలకు సోకకుండా చూసుకోవాలి.

ఇంటికి సున్నం ఎందుకు వేస్తారు....!!

మనిషికి చర్మం, ఇంటికి సున్నం వుండకపోతే కుదరవు. చర్మం రక్త మాంసాలకు కవచం గా వుంది ఎలా రక్షిస్తుందో, సున్నం కూడా గృహానికి రక్షణా కవచం లాగ వుంది రక్షిస్తుంది. గృహ నిర్మాణ రంగంలోకి సిమెంట్ రాక పూర్వం మహారాజుల మందిరాలు, దేవాలయాలు రుబ్బుడు సున్నం తో నిర్మించే వారు. తాజ్ మహల్,కుతుబ్ మీనార్, చార్మినార్, శ్రీరంగ నాధ దేవాలయం, కాశి విశ్వేశ్వరాలయం, స్వర్ణ మందిరం మొదలైన చారిత్రిక కట్టడాలన్నీ సున్నం తోనే నిర్మించారు. పూర్వ కాలం నాటి ఆన కట్టలు, వంతెనలు సున్నం తోనే కట్టినవి ఇప్పటికీ మూగ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. సున్నానికి వున్న ఆయుర్దాయం లో ఐదవ వంతు మాత్రమే సిమెంట్ కి వుంది.
ఇండ్లకి పండుగ, పర్వదినాలలో సున్నం ఎందుకు వేయాలి అంటే...!
ఇటుకల ఇంటికైనా, మట్టి ఇంటి కైనా, రాతి కట్టడానికైనా బట్టీ సున్నం వేయడం ఎంతో మంచిది. శుభ ప్రదం మరియు ఆరోగ్య ప్రదం.ఇంటి లోపల బయట క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సున్నం వేసుకుంటే. వేసవి వీడిమి నుండి రక్షణ లభిస్తుంది. అలాగే శీతా కాలపు అతి చల్లదనాన్ని కూడా లోనికి రానీయదు. సున్నం వేయడం వలన గదుల లోని వెలుతురు రెట్టింపు అవుతుంది. తెల్ల సున్నం మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. అలాగే హానికారక సుక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు.సున్నం వేసిన ఇంట్లో లక్ష్మి, సరస్వతులు ఇద్దరూ వుంటారు.ఇంట్లోని వారు ప్రశాంత జీవితం గడుపుతారు. అభివృద్ది కలుగుతుంది.
సున్నం వేయని ఇంట్లో గృహ ప్రవేశం చేయరాదు. ఇంట్లో పెళ్లి, ఉపనయనం వంటి శుభ కార్యక్రమాలు తలపెట్టినప్పుడు సున్నం తప్పని సరిగా వేయాలి. అలాగే ఆ ఇంట్లో మన ఆప్తుల మరణం సంభవించి సంవత్సరం పూర్తి అయినప్పుడు... సున్నం తప్పనిసరిగా వేయాలి. ప్రస్తుతం మనకు మన పూర్వీకులు వాడే సున్నం లభించుట లేదు. రక రకాల రంగులు ఎవరికి ఇష్టం వచ్చినవి వారు వేసుకుంటున్నారు. సున్నం వేయడం లోని శాస్త్రీయతను గుర్తించడం లేదు.

అస్తంగత్వం - మౌడ్యమి - మూడం...!!

ప్రతి గ్రహాం రవికి 12 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి.ఆ గ్రహాం తన కారకత్వాలను కోల్పోవుతుంది.ఆ గ్రహాం కోల్పోయిన బలాన్ని రవి స్వీకరిస్తాడు.
ఆ గ్రహాం యొక్క కారకత్వాలను రవి తన మహాదశలలో ఇస్తాడు.ఏగ్రహాం అయితే అస్తంగత్వం చెందుతుందో ఆగ్రహాం ఏకారకత్వాలను తెలియజేస్తాయో ఆ కార్యక్రమాలను చేయకూడదు.
కుజుడు:- కుజుడు అస్తంగత్వం చెందినప్పుడు ఆపరేషన్స్,యుద్ధాలు,రక్షణ సంభంధ నిర్ణయాలు ,పోలీస్ ఉద్యోగంలో చేరుట ఇంకా మొదలగు పనులు చేయకూడదు.
బుధ,శుక్ర మూడమిలలో అన్నప్రాశన తరువాత కార్యక్రమాలు చేయరాదు.అన్నప్రాశన ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చును.
గురువు:- గురువు మూడమిలలో సుఖానికి,దనానికి,సంబందంలేని పనులు చేసుకోవచ్చు,గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఉపనయనం చేయటం మంచిది కాదు.
శని:-శని అస్తంగత్వం చెందినప్పుడు ఉపాసన,దీక్ష,తపస్సు,మెడిటేషన్ వంటి పనులు చేయరాదు.
మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు,శుక్ర మౌడ్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది.
ఈ మూడమిలో జప,హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.

సంకష్టనాశన గణేశ స్తోత్రం......!!

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||
అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

ఏనామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయి....!!

ఏనామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయో అట్టి యోగినీ గణముయొక్క నామాలను స్కందుడు అగస్త్య మహర్షికి చెప్పాడు.
గజాననీ సింహముఖీ గృద్ధ్రాస్యా కాకతుండికా
ఉష్ట్రగ్రీవా, హయగ్రీవా, వారాహీ, శరభాననా
ఉలూకికా, శివారావా మయూరీ వికటాననా
అష్టవక్రా కోటరాక్షీ కుబ్జా వికటలోచనా
శుష్కోదరీ లలజ్జిహ్వా శ్వదంష్ట్రా వానరాననా
ఋకాక్షీ కేకరాక్షీ చ బృహిత్తుండా సురాప్రియా
కపాలహస్తా రక్తాక్షీ శుకీ శ్యేనీ కపోతికా
పాశహస్తా దండహస్తా ప్రచండా చండవిక్రమా
శిశుఘ్నీ పాపహంత్రీచ కాళీ రుధిరపాయినీ
వసాధయా గర్భభక్షా శివహస్తాంత్రమాలినీ
స్థూలకేశీ బృహత్కుక్షిః సర్పాస్యా ప్రేతవాహనా
దందశూకకరా క్రౌంచీ మృగశీర్షా వృకాననా
వ్యాత్తాస్యా ధూమనిఃశ్వాసా వ్యోమైకచరణోర్థ్వదృక్
తాపనీ శోషణీ దృష్టిః కోటరీ స్థూలనాసికా
విద్యుత్ప్రభా బలాకాస్యా మార్జారీ కటపూతనా
అట్టాట్టహాసా కామాక్షీ మృగాక్షీ మృగలోచనా
ప్రతిదినము మూడుపూటలు ఎవరు జపిస్తారో వారికి దుష్టబాధలు నశిస్తాయి. ఈ నామములు శిశువులకు శాంతికారకములు. స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు.

తిధులలో చేయవలసిన దేవతా వ్రతాలు, పూజలు


ఏ దేవతలను ఏ తిథినాడు ఆరాధిస్తే ఎంత మంచి పుణ్య ఫలం కలుగుతుంది? అనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం వరాహ పురాణంలో కనిపిస్తుంది. అందులో వరాహమూర్తిగా ఉన్న శ్రీమహావిష్ణువు స్వయంగా తిథుల విశేషాలను భూదేవికి వివరించి చెప్పాడు.
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కనుక తిథులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని ఆరాధిస్తే పుణ్య ఫలం దక్కుతుంది. భక్తులు ఆ రోజున పాలు మాత్రం తాగి ఉపవాసం ఉండి అగ్నిని ఆరాధించాలి. ఆ తర్వాత విదియ నాడు అశ్వనీ దేవతలను ఆరాధించాలి. ఈ తిథి నాడే అశ్వనీ దేవతలు జన్మించారు. సంవత్సర కాలం పాటు ఆ దేవతలను ఉద్దేశించి విదియ వ్రతం నియమ నిష్టలతో చేస్తే అందమైన రూపం కలుగుతుంది.
తదియ నాడు గౌరీ దేవిని ఆరాధించాలి. ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటైంది. తదియ నాడు గౌరీ కల్యాణం జరిగిన కారణంగా గౌరీ దేవికి ఈ తిథి అంటే ఎంతో ఇష్టం. చవితి వినాయకుడు పుట్టిన తిథి. ప్రత్యేకంగా వినాయక చవితి నాడే కాక ప్రతి శుద్ధ చవితి నాడు వినాయక పూజ చేయవచ్చు.
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగ దేవతకు పంచమి తిథి అంటే ఎక్కువ ఇష్టం. ప్రతి పంచమి నాడు పుట్టలో పాలు పోసి సంవత్సర కాలం పాటు నాగులను పూజిస్తూ ఆ పంచమి నాడు పులుపు లేని భోజనం చేస్తే నాగుల వల్ల భయం ఉండదు. నాగుల చవితి, నాగ పంచమి అనేవి రెండూ నాగదేవతకు ఇష్టమైనవే. షష్ఠి కుమారస్వామి జన్మ తిథి. ఆనాడు అర్చన చేస్తే కుమార స్వామికి ప్రీతికరం.
సప్తమి సూర్యుడి జన్మ తిథి. రథ సప్తమి నాడే కాక ప్రతిశుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించి క్షీరాన్నాన్ని నివేదిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. దుర్గా దేవి నుంచి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి అష్టమి. అందుకే ఆనాడు అష్ట మాతృకలను, దుర్గా దేవిని ఆరాధిస్తే ఎక్కువ పుణ్య ఫలం దక్కుతుంది. శివుడు అంధకాసురుడితో పోరాడేటప్పుడు లోక కల్యాణం కోసం ఆయనకు సహకరించేందుకే అష్ట మాతృకల ఆవిర్భావం జరిగింది. అష్టమి నాడు కేవలం మారేడు చివుళ్ళను తిని అష్ట మాతృకలను పూజిస్తే ఆ తల్లులు కష్టకాలంలో ఆదుకుంటారు.
నవమి కూడా దుర్గా దేవికి ఇష్టమైనదే. ఆ రోజున దుర్గను పూజించి ఉపవాసం ఉండి కేవలం పిండిని మాత్రమే స్వీకరించి పూజ చేస్తే సంపదలు కలుగుతాయి. దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకుల పూజ దశమి నాడు చేస్తే పాపం నశిస్తుంది. ఏకాదశి కుబేరుడు పుట్టిన తిథి. ఆ రోజున కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రదం. ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. ఈ తిథినాడే విష్ణుమూర్తి వామనుడై జన్మించాడు. ద్వాదశి నాడు ఆవు నెయ్యిని మాత్రమే స్వీకరించి వ్రతం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.
ధర్ముడు పుట్టిన తిథి త్రయోదశి. ఈ తిథి నాడు ఉపవాసం ఉండి ఎవరికి నచ్చిన దైవాన్ని వారు ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా పూజ చేస్తే అధిక పుణ్య ఫలం దక్కుతుంది. చతుర్దశి రుద్రుడి జన్మ తిథి. ఈనాడు చేసే రుద్రార్చన గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. యవ, గోధుమల అన్నాన్ని మాత్రమే స్వీకరించి రుద్రార్చన చేయాలి. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ తిథి శివుడికి ఎంతో ప్రీతికరం.
అమావాస్య పితృ దేవతలకు ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజున దర్భలు, నువ్వులు నీళ్ళతో పితృదేవతలకు తర్పణమిస్తే పితృదేవతలు ఎంతో సంతోషించి ఆ తర్పణ మిచ్చిన వారికి సంతాన సౌఖ్యం అనుగ్రహిస్తారు. పూర్ణిమకు చంద్రుడు అధిపతి. పూర్ణిమ నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజ చేసిన వారికి ధన ధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి.
ఇలా తిథులలో ఒక్కో తిథికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయా దేవతలను ఆరాధించి ప్రత్యేకమైన కోర్కెలు సాధించాలనుకున్న వారు ఆయా తిథులలో పూజలు, వ్రతాలను చేస్తే విశేష ఫలితం ఉంటుందని ఈ కథా సందర్భంలో శ్రీ మహా విష్ణువు భూదేవికి వివరించి చెప్పాడు. ఒక క్రమ పద్ధతిలో అర్చనలు, పూజలు, వ్రతాలు జరగడానికి ఇదెంతో ఉపయుక్తం అనిపిస్తుంది.

జ్యొతిష్య శస్త్రా రిత్యా మెధస్సు పెరగలంటే?


జగద్గురు

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులొక అనన్య సామాన్యమైన వ్యక్తి. ఆయన మన భారతదేశంలో జన్మించటం నిజంగా మన భారతీయుల కొక గర్వకారణం. అయితే ఆయన ఏ శతాబ్దంలో జన్మించాడనే విషయం మాత్ర మిప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. క్రీస్తుకు పూర్వమని కొందరంటే తరువాత అని కొందరంటున్నారు. అయినా ఏ శతాబ్దంలో ఎప్పుడు జన్మిస్తేనేమి, ఎప్పుడూ, ఎక్కడా అనేవి మనకు ప్రధానం కావు. ఆయన భాషలోనే చెబితే అవి కేవలం వ్యావహారికమే. అలాంటప్పుడనవసరంగా వాటిని గురించి మనం తలబ్రద్దలు చేసుకోవటం దేనికి. అనావశ్యకం. ఆయన ఎప్పుడైనా జన్మించి ఉండవచ్చు. ఎక్కడైనా జన్మించి ఉండవచ్చు. మొత్తంమీద అలాంటి మహానుభావుణ్ని మాత్రం మనమిక చరిత్రలో మరలా చూడబోమే. ఏమి కారణం. ఆయన ఈ మానవ లోకాని కుపదేశించిపోయిన విజ్ఞానమలాంటిది. అది పరిపూర్ణమైన అద్వైత విజ్ఞానం. సృష్టికంతా సారం మానవుడైతే-మానవుడికి సారమాతని విజ్ఞానమైతే, ఆ విజ్ఞానానికంతటికీ పరమసారమద్వైత విజ్ఞానమే.
అదేమిటి-మానవుడీలోకంలో ఆర్జించిన విజ్ఞానమెంతో ఉంది గదా. లోక జ్ఞాన Common Sense ముంది శాస్త్రజ్ఞాన Scientific sense ముంది. కళాజ్ఞాన Artistic sense ముంది. ఇన్ని జ్ఞానాలుండగా ఇందులో దేనికీ లేని విశిష్టత ఈ అద్వైత విజ్ఞానానికే ఎలా ఏర్పడిందని ప్రశ్న వస్తుంది వాస్తవమే. మానవుడార్జించిన విజ్ఞానమెంతో ఉంది. సందేహం లేదు. కాని ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా అవన్నీ చివరకు నిరుపయోగమే. కారణమేమంటే వాటిన్నింటిలోనూ రెండు ప్రబలమైన దోషాలున్నాయి. ఒకటి అపేక్ష Relativity. మరొకటి బాధ Controversity అపేక్ష అంటే దీని తరువాత ఏమిటనే ప్రశ్న. ఈ ప్రశ్న మనం సాధించిన ప్రతి విజ్ఞానంలోనూ పొడచూపుతుంది. చూడండి. మనమే విజ్ఞానాన్ని ఎంత సాధించినా ఇంకా సాధించవలసింది ఉండనే ఉంటుంది. సాధించింది ఒక బిందువైతే సాధించవలసింది ఒక మహాసముద్రం. ఎంత ఈదినా దాని తీరం చేరుతామనే ఆశ ఎప్పటికీ లేదు జీవితంలో. కాబట్టి అపేక్ష అనే దోషమొకటి ఉంది మన జ్ఞానానికి.
అలాగే బాధ అనే దోషం కూడా ఒకటుంది. బాధ ఏమిటి. బాధ అంటే మనమెందులో ఎంత జ్ఞానం సంపాదించినా అది పనికి రాకుండా పోవటం. ఇది కూడా మన కనుభవ సిద్ధమే. చూడండి. ప్రతి రంగంలోనూ మన మెంతెంతో పరిశోధన చేస్తున్నాము. ఎన్నెన్నో విషయాలు తెలుసుకొంటున్నాము. అవన్నీ అప్పటికప్పుడు సత్యమనే నమ్ముతుంటాము. కానీ అంతకన్నా ముందుకు పోయి మరి ఒక క్రొత్త రహస్యం కనుగొనే సరికంతకు ముందరిదంతా బలాదూరవుతున్నది. అది మరి కొంతదూరం ప్రయాణం చేసే సరికి పేలవమయి పోతున్నది. ఈ విజ్ఞాన యాత్ర ఇలా నిరంతరమూ కొనసాగవలసిందే గనుక చివరకంతా బాధితం కాక తప్పదు. ఏతావతా తేలిందేమంటే మానవుడార్జించిన ఆర్జిస్తున్న ప్రతి ఒక్క విజ్ఞానమూ కూడా అపేక్షా బాధలనే ఈ రెండు దోషాలకూ గురి కావలసిందే. అది నీవు లోకజ్ఞానమని చెప్పు. శాస్త్రమని చెప్పు. కళాజ్ఞానమని చెప్పు. ఏదైనా సరే. రెండింటి కబంధ హస్తాల నుంచీ తప్పించుకొని బయటపడడం కల్ల.
కాగా ఈ రెండు లక్షణాలూ లేని విజ్ఞానమేదైనా ఉందంటే అది ఒక్క అద్వైత విజ్ఞానమే. ఎంచేతనంటే అసలద్వైతమని పేరు పెట్టటంలోనే ఉన్నదా రహస్యం. అద్వైతమంటే ఏమిటి. రెండవ పదార్ధమంటూ ఏదీలేదు. ఉన్నదంతా ఒక్క ఆత్మచైతన్యమే నని గదా, చైతన్యం తప్ప మరొకటేదీ లేదన్నప్పుడిక అపేక్ష ఏముంది. బాధ ఏముంది. ఇది గాక మరొకటున్నదని ఒప్పుకొన్నప్పుడే వాటి రెంటికీ అవకాశమేర్పడేది. లేకుంటే అసలాస్కారమే లేదు వాటికి. అపేక్షా బాధలు రెండూ లేవంటే అది ఒక పరిపూర్ణమైన జ్ఞానం కాక తప్పదు. ఇలాటి పరిపూర్ణమైన జ్ఞానమే అద్వైత జ్ఞానం.
అంతేకాదు. పరిపూర్ణ మెప్పుడయిందో అప్పుడిక పురుషార్థమనేది కూడా దానితోనే పరిసమాప్తమవుతున్నది. పురుషుడు కోరేదేదో అది పురుషార్ధం The aim and goal of human life. పురుషుడంటే మానవుడే, మానవులందరూ కోరే పదార్ధాలు రెండే ప్రపంచంలో. అన్నీ తెలుసుకోవాలని ఒకటి. అనవరతమూ సుఖంగా బ్రతకాలని ఒకటి. ఇంతకు మించి మరేదీ కానరాదు. ఇందులో మొదటి దానికి జిజ్ఞాస అనీ, రెండవదానికి ముముక్ష అనీ పేరు పెట్టారు మన ప్రాచీనులు. ఇవి రెండూ నెరవేరే వరకూ పురుషార్థమనే దానికి మనం నోచుకోలేము. అద్వైత మన్నప్పుడింకొక భావానికే అసలాస్కారం లేదనిగదా చెప్పాము. అలాంటప్పుడిక జిజ్ఞాస ముముక్షలు మాత్రమెక్కడివి. ఇవి కూడా వాటిపాటి కవి సమసి పోవలసిందే. పోతే పురుషార్థమనేది మన కప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అంచేత మానవుడు సాధించిన అన్ని విజ్ఞానాలకూ ఆఖరిమెట్టు అద్వైత విజ్ఞానమే. అవి సాపేక్షమైతే Relative ఇది నిరపేక్షం Absolute. అవి సబాధమైతే Contradicted ఇది నిర్బాధం Uncontradicted ఇది అద్వైత విజ్ఞానానికుండే విశిష్టత.
ఇలాంటి విలక్షణమైన జ్ఞానాన్ని మనకు బోధించగలిగారంటే అలా బోధించిన భగవత్పాదులెంతటి మహనీయులో వేరుగా చెప్పబని లేదు. అసలు వారికి భగవత్పాదులని బిరుద మేర్పడటంలోనే మనకీ విషయ మవగత మవుతుంది. తెలియవలసినదంతా తెలుసుకొని దాన్ని అనుభవానికి తెచ్చుకొన్న పూర్ణ పురుషులే భగవత్పాదులు. శంకరులలాంటి పూర్ణ పురుషులు. వారికి పరమార్ధమంతా చేతిలో వెన్నముద్దలాగా స్వానుభవానికి వచ్చింది. అనుభవమనేది లేకుంటే ఏదిగానీ ఒక సిద్ధాంతంగా Doctrine or theory బయటికి రాదు. మానవుల సిద్ధాంతాలన్నీ Concepts వారి వారి అనుభవాలకు ప్రతీకలే Indications. సిద్ధాంతా లన్నిటికీ తలమానిక మద్వైత సిద్దాంతమని గదా ప్రతిపాదించాము. అలాంటప్పుడది ఎవరి అనుభవానికి రాకుండానే ఎలా అవతరించగలదు. ఒకవేళ అవతరించిందని వాదించినా దాని కర్థమేముంది. కాబట్టి దాని నొక సిద్ధాంతంగా శంకర భగవత్పాదులు లోకానికి చాటారంటే ఆయన కది ముందుగా అనుభవ గోచరమయి ఉండవలసిందే, ఇందులో అనుభవానికి తెచ్చుకోవటం వల్లనే ఆయన భగవత్పాదులయ్యారు. అలా తెచ్చుకొన్న విజ్ఞానాన్ని మరలా ఈ మానవ సమాజాని కుపదేశించి పోవటంవల్ల ఆయన జగద్గురువులు కూడా అయ్యారు.
అయితే మనకిక్కడ ఒక ఆశంక కలగవచ్చు. శంకరులు బోధించారని చెప్పే ఈఅద్వైత విజ్ఞానమంతకు ముందునుంచీ మన ఉపనిషద్వాఙ్మయంలోనే ఉంది గదా. ఇక ఆయన మనకు క్రొత్తగా చేసిన బోధ ఏమిటి అని. అదీ వాస్తవమే. ఉపనిషత్తులలోనే ఉన్నాయి అద్వైత జ్ఞాన రత్నాలన్నీ. సందేహం లేదు.కాని అవి బాగా లోతుకు దిగి గాలించినప్పుడే చేతికందేది. ఆ పాతతః చూచామంటే వాటిలో ఒక్క అద్వైతమే గాదు. సాంఖ్యయోగాది ద్వైతవాసనలు కూడా గుబాళిస్తుంటాయి. ఎక్కడికక్కడే మనకుపనిషత్తుల భావమిదే కావచ్చుననే భ్రాంతి ఏర్పడుతుంది. మనకేమిటి. అసలు పెద్ద పెద్ద మతాచార్యులకే ఏర్పడింది ఇలాంటి అపోహ. కనుకనే ఎవరికి తోచినట్లు వారు ఉపనిషద్వాక్యాలకు వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు. దానితో అసలుపనిషత్తాత్పర్య Import మేమిటో ఎవరికీ అంతు పట్టకుండా మరగున బడిపోయింది. అలాంటి పరిస్ధితిలో అవతరించారు శంకర భగవత్పాదులు. అలా అవతరించి పరస్పర విరుద్ధంగా కనపడే భావాలనన్నిటినీ సమన్వయించి ఉపనిషత్తులన్నిటికీ కలిపి ఒక్క అద్వైతమే వివక్షిత Intention మని ఆయన సిద్ధాంతం చేశారు.
ఇది ఒక్క ఉపనిషత్తులకేగాదు. ఆ మాటకు వస్తే శ్రుతులకన్నింటికీ కూడా అద్వైతమే పరాయణమని ఆయన చేసిన తీర్మానం. ఋగ్యజుస్సా మాథర్వణాలనే నాలుగు శ్రుతులూ ఒక జ్ఞానకాండనే గాక విధ్యుపాసన రూపమైన కర్మకాండను గూడా ప్రతిపాదిస్తాయి. ఇందులో జ్ఞానకాండ అనబడే ఉపనిషత్తులొక వేళ అద్వైత భావాని కనుకూలమైనా కర్మకాండ మాత్రమలా అయినట్టు కనిపించదు. కర్మ అనేది దాని స్వరూపాన్ని బట్టి చూచినా అది ఇచ్చే స్వర్గాది ఫలాన్ని బట్టి చూచినా కేవల మీద్వైత ప్రపంచంతోనే ముడిబడి ఉన్నట్టు తోస్తుంది. కానీ చిత్రమేమంటే ఆ కర్మలు కూడా కామ్యవర్జితంగా ఆచరిస్తే చాలు. మానవుడికి చిత్తశుద్ధిని ప్రసాదించి తద్ద్వారా జ్ఞానోత్పత్తికే దోహదం చేస్తాయి. అప్పటి కుపనిషత్తులు సాక్షాత్తుగా Direct నైతే కర్మోపాసనలు రెండూ పరంపరగా Indirect సాధనాలవుతాయి అద్వైతానికి. దీనిని బట్టి కాండద్వయాత్మకమైన శ్రుతికంతటికీ అద్వైతమే పరమార్ధమని ఏక వాక్యతను Uniformity నిరూపించారు శంకరులు.
శ్రుతులకు నిరూపించ గలిగారంటే ఆ శ్రుతుల అడుగుజాడలలో పయనించేవే మను యాజ్ఞవల్క్యాది స్మృతులు కూడా. కాబట్టి వాటికి కూడా నిరూపించి నట్టయింది. పోతే ఈ శ్రుతి స్మృతులలోని భావాలనే కథా రూపంగా బయట పెడతాయి ఇతిహాస పురాణాలు. కనుక వాటికి కూడా ఇదే తాత్పర్యమని చాటినట్టయింది. మొత్తంమీద శ్రుతి స్మృతి పురాణేతి హాసభేద భిన్నమైన సమస్త వాఙ్మయానికీ అద్వైత జ్ఞానమొక్కటే చివరకు పరాయణమని ఆయన చేసిన సమన్వయం.