Wednesday 26 August 2015

తిధులు

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.
ఉత్తమ తిధులు:- 11. శుక్ల ఏకాదశి,12. శుక్ల ద్వాదశి,13. శుక్ల త్రయోదశి,14. శుక్ల చతుర్దశి,15. పూర్ణిమ, 1. కృష్ణ పాడ్యమి,2. కృష్ణ విదియ,3. కృష్ణ తదియ,4. కృష్ణ చవితి,5. కృష్ణ పంచమి.
మద్యమ తిధులు:- 6. శుక్ల షష్ఠి,7. శుక్ల సప్తమి,8. శుక్ల అష్టమి,9. శుక్ల నవమి,10. శుక్ల దశమి, 6. కృష్ణ షష్ఠి7. కృష్ణ సప్తమి,8. కృష్ణ అష్టమి,9. కృష్ణ నవమి,10. కృష్ణ దశమి.
అధమ తిధులు:- 12. శుక్ల ద్వాదశి,3.శుక్ల తదియ,4.శుక్ల చవితి,5.శుక్ల పంచమి.11.కృష్ణ ఏకాదశి,12.కృష్ణ ద్వాదశి,13.కృష్ణ త్రయోదశి,14.కృష్ణ చతుర్ధశి,15.అమావాస్య.
సంకల్పతిధి;-ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి.ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’రెండవ తిధి అని చెప్పాలి.
తిధి సంధి:-పంచమి,షష్ఠి లయొక్కయు,దశమి,ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును.ఈ సంధిన జననమైన యెడల పితృగండం.
గండతిధి:-పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు,నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి.శుభకార్యాలు చేయరాదు.
పంచ పర్వతిధులు :-అష్టమి,చతుర్ధశి,అమావాస్య,పౌర్ణమి,సూర్య సంక్రమణం ఉన్న తిధి పంచపర్వ తిధులు అంటారు.ఇవి శుభకార్యాలకు పనికిరావు.
పక్ష రంధ్ర తిధులు:-చవితి మొదటి 8 ఘడియలు,షష్ఠి మొదటి 9 ఘడియలు,అష్టమి మొదటి 14 ఘడియలు,నవమి మొదటి 25 ఘడియలు,ద్వాదశి మొదటి 10 ఘడియలు,చతుర్ధశి మొదటి 5 ఘడియలు.ఈ ఘడియలలో వివాహం చేయరాదు.మిగిలిన ఘడియలు శుభప్రధములు.
పితృకార్యములకు తిధి:-అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటిభాగం ప్రాతఃకాలం,రెండవ భాగం సంగమ కాలం,మూడవ భాగం మధ్యాన్నం,నాల్గవ భాగం అపరాహ్నం,ఐదోభాగం సాయంకాలం .ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.

గ్రహాలు అవస్ధలు

శ్లో;-దీప్తాస్స్వస్ధో ముదిత శ్శాన్త శ్శక్తోని పీడితో భీతః
వికలః ఖలశ్చకధితో నవ ప్రకారో గ్రహౌహరినా!
దీప్తావస్ధ,స్వస్ధావస్ధ,ముధితావస్ధ,శాంతావస్ధ,శాక్తావస్ధ,పీడావస్ధ,భీతావస్ధ,వికలావస్ధ,ఖలావస్ధ,దీనావస్ధ అను పది అవస్ధలలో రవ్వాది గ్రహములు ఏదో ఒక అవస్ధ పొందుదురు.
1)దీప్తావస్ధ:-గ్రహాలు ఉచ్చక్షేత్రంలో ఉంటే పొందే అవస్ధ. దీప్తావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో కీర్తి ప్రతిష్ఠలు,సకల సంపదలు కలుగును.
2)స్వస్ధావస్ధ:-గ్రహాలు స్వస్ధానంలో ఉన్నచో పొందే అవస్ధ.స్వస్ధానం యందున్న గ్రహం యొక్క దశలలో ధనం,సుఖాలు,సౌఖ్యాలు, కలుగును.
3)ముధితావస్ధ:-గ్రహాలు మిత్రక్షేత్రమందున్నప్పుడు పొందే అవస్ధ.ముధితావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో దనము,భోగాలు,రాజయోగాలు కలుగును.
4)శాంతావస్ధ:-గ్రహాలు సమక్షేత్రంలోను,శుభవర్గు యందున్న గ్రహం పొందే అవస్ధ. శాంతావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో శాంతము,సుఖము,భోగాలు,ధనం,విద్యార్జన,పరోపకార బుద్ధి,దర్మబుద్ధి కలుగును.
5)శాక్తావస్ధ:-గ్రహాలు వక్రించినప్పుడు పొందే అవస్ధ.గ్రహాలు వక్రత్వమును వీడి రుజుగతి యందున్నప్పుడు పొందే అవస్ధ.శాక్తావస్ధ యందున్న గ్రహం మూడవ వంతు,లేదా నాల్గవ వంతు బలం కలిగి తనకి సంబందించిన ఫలితాలను క్రమక్రమంగా ఇచ్చేదరు.శాక్తావస్ధ రవిచంద్రులకు ,రాహు కేతువులకు ప్రాప్తించదు. భోగాలు కీర్తిని పొందుతారు.
6)పీడావస్ధ:-గ్రహాలకు వేధ కలిగిన,గ్రహ యుద్ధమునందు ఓడిపోయినను రాశ్యాంతరమునందు ఉన్నను ఈ అవస్ధ కలుగును.కార్యహాని,వ్యతిరేకత,ఆటంకాలు,భాధలు,రోగం,శత్రుభాదలు,,బందువులు దూరమగును.
7)దీనావస్ధ:-గ్రహాలు శత్రుక్షేత్రం లో ఉన్నప్పుడు,అధి శత్రు గ్రహముల యొక్క రాశులయందున్నప్పుడు పొందే అవస్ధ. మరియు పనులలో ఆటంకాలు,శత్రుత్వము పొందగలరు.
8)ఖలావస్ధ:-గ్రహాలు నీచ క్షేత్రంలో ,శత్రు నవాంశ నందు,పాప షడ్వర్గుల యందు ఉన్నప్పుడు ఈ అవస్ధ పొందును.కలహాలు,నష్టాలు కలిగించును.
9)బీతావస్ధ:-గ్రహాలు అతిచారం,నీచ నవాంశ (గ్రహాలు రాశిచక్రంలో ఉచ్ఛలో ఉండి నవాంశ చక్రంలో నీచలో ఉన్నప్పుడు)పొందే అవస్ధ.బీతావస్ధ పొందిన గ్రహ దశలో దన నష్టము,దరిద్రం,కలుగును.
10)వికలావస్ధ:-గ్రహాలు అస్తంగత్వం పొందినప్పుడు ఏర్పడే అవస్ధ. వికలావస్ధ పొందిన గ్రహా దశలలో అశాంతి,అస్ధిరత్వము,రోగాభివృద్ధి కలుగును.

ద్విపుష్కర, త్రిపుష్కర యోగాలు

ధర్మం విధి నిషేధాత్మకం, కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయరాదు. కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉదాహరణకు త్రిపుష్కర, ద్విపుష్కర యోగాల్లో వస్తు లాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతం అవుతూ ఉంటాయి. మన చేతిలో లేని నష్టాలు మొదలగువాని విషయం ఎలా ఉన్నా మనం చేసే పనుల్తో డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతమైతే మరల మరల చేయాల్సి వస్తే కష్టం కదా! అందుకని ఆయా సమయాల్లో ఇవ్వవలసినవి గాని ఇష్టపూర్వకంగా ఇచ్చేవి ఇవ్వకుండా జాగ్రత్త పడవచ్చు.
ద్విపుష్కర యోగం: ఆది, మంగళ, శనివారాలు. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. ధనిష్ట, చిత్త, మృగశిర నక్షత్రాలు కలిసినపుడు ద్విపుష్కర యోగం. ఈ రోజుల్లో వస్తువు పోయినా, లభించినా ఆ క్రియలు మరల జరుగుతాయి.
త్రిపుష్కర యోగం: ఆది, మంగళ, శనివారాలు, విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. విశాఖ, ఉత్తర, పూర్వాభాద్ర, పునర్వసు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కలిస్తే త్రిపుష్కరయోగం. ఈ రోజుల్లో మృతి, వస్తులాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం మొదలైనవి మూడుసార్లు పునరావృతమవుతాయి. కాబట్టి ఆ రోజుల్లో మరల మరల జరగరాదనుకునే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి.ఈ యోగాలలో దానధర్మాలు చేయవచ్చు గానీ, లౌకిక కార్యాలలో డబ్బు ఇవ్వకపోవడం మంచిది. ఈ రోజులలో అప్పిస్తే తిరిగిరాదు సరికదా! మనమే మరల మరల ఇస్తుండాల్సి వస్తుంది. అత్యవసరం కానపుడు మందులు వాడకండి. వాడితే మళ్ళీ మళ్ళీ వాడాల్సి వస్తుంది. అదే విధంగా ఈ రోజుల్లో ఆపరేషన్లు చేయించకుండా ఉంటే మంచిది. మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఇబ్బంది. మళ్ళీ మళ్ళీ చేయవచ్చు అనే పనులు చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం వలన ఇబ్బంది కలిగే పనులు చేయకండి. ఇలాగే అప్పు చేయడానికి సోమవారం మంచిది. త్రిపుష్కర, ద్విపుష్కర యోగాలు లేని మంగళవారం అప్పు తీర్చడానికి మంచిది. మంగళవారం అప్పు కొంతైనా తీరుస్తే అప్పుగా త్వరగా తీరుతుంది. బుధవారం అప్పు ఇవ్వడానికి గాని, తీసుకోవడం గాని లేదా దేనికైనా డబ్బు ఇవ్వడంగాని మంచిది కాదు.
అప్పు ఇస్తే తిరిగి వసూలు కావడానికి ఇబ్బంది కలిగే నక్షత్రాలు ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, విశాఖ, రోహిణి, కృత్తిక, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, మూల, జ్యేష్ఠ, స్వాతి.

కుజ దోషం పరిహారాలు

కుజ అనగా భూమి పుత్రుడు. ఆధునిక వైజ్ఞానికులు కుడా భూమికి కుజునికి పోలికలు ఉంటాయని నిరూపించారు.
ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
అని మన పూర్వ మహర్షులు వర్ణించారు. ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు.
పరిహారాలు:-ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉండి కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.
స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.
సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
పిల్లలు లేని దంపతులు ఏడు మంగలవారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.
కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.
కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
కుజదశలో కుజుని అంతర్దశకు....ఉత్తరకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.
కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ యాభై ఎనిమిదవసర్గ, తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
కుజ దశలో కేతు అంతర్దశకు-- యుధకాండ నూట పదహారు సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
కుజ దశలో శని అంతర్దశకు -- అరణ్యకాండ డెభై వ సర్గ -- నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
కుజుదశలో బుధ అంతర్దశ --- బాలకాండ పదహారవసర్గ -- ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
కుజు దశలో గురు అంతర్దశ -- సుందర కాండ యాభై ఒకటి సర్గ--- అరటిపండ్లు నైవేద్యము.
కుజ దశలో శుక్ర అంతర్దశకు --- సుందరాకాండ యాబై మూడు సర్గ -- పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం
.
కుజ దశలో రవి అంతర్దశకు --- బాలకాండ ఇరై మూడు సర్గ -- చామ కారెట్ దుంప నైవేద్యము.
కుజదశలో రవి అంతర్దశకు --- బాలకాండ పదిహేడవ సర్గ-- పాలు, పాయేసం నైవేద్యము

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తివంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు.
తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

కార్తవీర్యార్జున స్తోత్రముః


కార్తవీర్య ఖలద్వేషి కృతవీర్య సుతోబలి
సహస్రబాహు శత్రుఘ్నో రక్త్రవాసా ధనుర్ధః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తు అభీష్టదః
రాజసైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్
సంపదః తస్య జాయంతి జనాస్తస్య వషంఘదః
అనాయతాషు క్షేమలాభయుతం ప్రియమ్.
కార్తవీర్యార్జునోనామ రాజా బాహు సహస్రభృత్
తస్య స్మరణ మాత్రేన హృతం నష్టం చ లాభయతి
కార్తవీర్యః మహాబాహో సర్వ దుష్ట విభర్హణః
సహస్రబాహుం సాహస్రం స
రక్తాంబరం రక్తకిరీట కుణ్డలమ్,
చోరాని దుష్టభయ నాశనం ఇష్టదం తం
ధ్యాయేత్ మహాబల విజ్హృంభిత
కార్తవీర్యం యస్య సంస్మరణాదేవ
సర్వ దుఃఖ క్షయోభవేత్ తం నమామి మహావీర్యార్జునమ్
కార్తవీర్యజం హైహయాధిపతేస్తోత్రం
సహస్ర వర్తనం క్రియం వాంచితార్థప్రదం నరాణామ్
శూద్ర దయైర్యాతి నామ శ్రుతమ్
ఇతి దమర తంత్రే ఉమామహేశ్వర సంవాదే
కార్తవీర్యస్తోత్రమ్ సంపూర్ణమ్.

Friday 21 August 2015

పితృకర్మలు ఎందుకుచేయాలి?

వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .
శ్లోకం : "దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే "
దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు బోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు బోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము

Saturday 15 August 2015

హనుమాన్ చాలీసా

ధ్యానం:
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం
యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలీం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి
వరుణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి
బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్
చౌపాయి:
1. జయ హనుమాన ఙ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర ||
2. రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవన సుతనామా ||
3. మహావీర విక్రమ బజరంగీ |
కుమతినివార సుమతి కేసంగీ ||
4. కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా ||
5. హాథ వజ్ర ఔధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవుసాజై ||
6. శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన ||
7. విద్యావాన గుణీ అతి చాతుర |
రామకాజ కరివేకో ఆతుర ||
8. ప్రభు చరిత్ర సునివేకో రసియా |
రామలఖన సీతా మన బసియా ||
9. సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |
వికటరూప దరి లంక జరావా ||
10. భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్రకే కాజ సంవారే ||
11. లాయ సజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ||
12. రఘుపతి కీన్హీబహుత బఢాయీ |
తమ్మమ ప్రియ భరతహి సమభాయీ ||
13. సహస్ర వదన తుమ్హరో యశగావై |
అసకహి శ్రీపతి కంఠలగావై ||
14. సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా ||
15. యమ కుబేర దిగపాల జహాతే |
కవి కోవిద కహిసకే కహాతే ||
16. తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా ||
17. తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగజానా ||
18. యుగ సహస్ర యోజన పరభానూ |
లీల్యో తాహి మధుర ఫలజానూ ||
19. ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ |
జలధిలాంఘిగయే అచరజనాహీ ||
20. దుర్గమ కాజ జగతకే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||
21. రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే ||
22. సబ సుఖలహై తుమ్హారీ శరనా |
తుమ రక్షక కాహూకో డరనా ||
23. ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనో లోక హాంకతే కాంపై ||
24. భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై ||
25. నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా ||
26. సంకటతే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జోలావై ||
27. సబ పర రామ తపస్వీరాజా |
తినకే కాజ సకల తుమ సాజా ||
28. ఔర మనోరధ జోకోయి లావై |
సోఇ అమిత జీవన ఫలపావై ||
29. చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా ||
30. సాధు సంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామదులారే ||
31. అష్ఠసిద్ధి నౌనిధికే దాతా |
అస వర దీన్హా జానకీ మాతా ||
32. రామ రసాయన తుమ్హారే పాసా |
సదా రహో రఘుపతికే దాసా ||
33. తుమ్హరే భజన రామకోపావై |
జన్మ జన్మకే దుఃఖ బిసరావై ||
34. అంత కాల రఘువరపుర జాయీ |
జహా జన్మకే హరిభక్త కహాయీ ||
35. ఔర దేవతా చిత్తన ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ||
36. సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా ||
37. జై జై జై హనుమాన గోసాయీ |
కృపాకరో గురుదేవకీ నాయీ ||
38. యహా శతవార పాఠకర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ ||
39. జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ||
40. తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహాడేరా ||

Friday 14 August 2015

శ్రావణమాసం పవిత్రత

నేటి నుండి శ్రావణ మాసం ప్రారంభం ! ఈ మాసం గొప్ప పవిత్రమైనది. ఈ నెలలో వివిధ సాధనలు ఉత్తమ ఫలితలనిస్తాయి. ఈ మాసం ఏకభుక్తం ( ఒంటిపూట భోజనం), నక్త వ్రతం ( పగలంతా ఉపవాసముండి రాత్రి ఆరంభంలో భగవన్నివేదిత ఆహారం స్వీకరించడం ) పాటించితే చక్కని ఫలితాలు లభిస్తాయి. నెలంతా శివునకు, విష్ణువునకు అభిషేకం చేస్తే అన్ని అరిష్టాలు తొలగుతాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో గొప్ప వ్రతం సోమవార వ్రతం . శ్రావణ సోమవారాలు ఉపవాసము, లేదా నక్తవ్రతం చేయడం ఉత్కృష్టం, శివప్రీతికరం.
సోమవార వ్రతం కార్యం శ్రావణే వై యథావిధి
శక్తేనో పోషణం కార్యం అథవా నిడిభోజనం
శ్రావణ సోమవార వ్రతం మహిమాన్వితమైనది. శక్తి కలిగిన వారు ఉపవాసం చేయవచ్చు. లేనివారు పగలంతా ఉపవాసముండి రాత్రి ప్రారంభంలో శివునకు నివేదించిన ఆహారాన్ని ( ప్రసాదాన్ని స్వీకరించాలి) .
శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.
ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.
వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.
స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.
పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.
ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.
ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు మేఘాలు వర్షాధారలతో దేశమును చల్లపరుచునపుడు కృష్యాడి కార్యములు నిర్విఘ్నంగా సాగాగాలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుం

Thursday 13 August 2015

దుర్గాదేవి స్తోత్రం

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
(భాగ -ప్ర -౮)
ఇది దుర్గాదేవి స్తోత్రం...."అమ్మ" అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన పోతన్న గారి అసమాన ప్రతిభ....భక్తుడికీ,భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి పిలుపు....,"దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా,ప్రేమగా పిలుచుకునే భావనని,భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు నా శతకోటి వందనాలు..........నా నిత్యపూజలో ఎన్ని స్తోత్రాలు చదివినా,ఎన్ని మంత్రాలు జపించినా,,’అమ్మ’పూజ మొదలెట్టేది మాత్రం ఈ తియ్యటి పిలుపుతోనే..ఈ మహామంత్రంతోనే....
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ------ అసలు స్త్రీ దేవతలంతా దుర్గనుండే పుట్టారట!! లక్ష్మీ,సరస్వతీ,పార్వతులు..చిట్టచివరకు గంగానమ్మ వరకు గూడా దుర్గమ్మ అంశతో పుట్టినవారేనట!! అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింపబడ్డది........ పురుష లక్షణంకల దేవతలందఱు విష్ణువునుండి గాని,శివుడినుండి గాని పుట్టినట్టు చెప్పబడరు.... కాని కాళీ,దుర్గ,లలిత,మహేశ్వరి,పార్వతి,లక్ష్మి,సరస్వతి మొదలైన దేవతలు..వారాహి,చండీ,బగళా మొదలైన మాతలు....రేణుక ఇత్యాది శక్తులు...చివరకు గ్రామదేవతలు కూడా శ్రీమహాదుర్గా దేవతాంశసంభూతులుగా చెప్పబడతారు...దీనికి కారణమేమిటి?
ఏమిటంటే?
ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది....పురుషుడు ప్రాణదాత, స్త్రీ శరీరదాత్రి.....అసలు ఈ కార్యకారణ సంఘాతమంతా పంచభూతాలనుండి పుడుతోంది.....చేతన రూపమైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు..............కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం...అంతా ఒక ముద్ద...ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహారమై, పంచేంద్రియ లక్షణ భూతమై పుడుతోంది....(పంచభూతాలంటే భూమి,గాలి,నీరు,అగ్ని,ఆకాశం....పంచేంద్రియాలంటే ప్రపంచాన్ని చూసే కళ్ళు, రకరకాల వాసనలు పీల్చే ముక్కు, ప్రతి పదార్థం రుచినీ తెలిపే నాలుక, ఈ సృష్టిలో శబ్దాలన్నిటినీ వినిపించే చెవులు, స్పర్శని తెలియజేసే చర్మం...ఈ ఐదిటివల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి)............కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటోంది...అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది.....బహుజీవులుగా పుడుతోంది, చస్తోంది,,మళ్ళాజన్మిస్తోంది.............కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు.అది సర్వదా ఒక్కటే శక్తి.......రూపాన్ని బట్టి, దేశకాల పరిస్థితులని బట్టీ భిన్నమౌతుందే కాని,,,, చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మనిబట్టి మారదు......అదే మహాశక్తి.....ఆమే దుర్గ....
చాల పెద్దమ్మ-------- ఆమె సనాతని....ఇప్పటిదికాదు....ఎప్పటిదో......ఈ సృష్టి ఉన్నప్పుడూ,లేనప్పుడూ ఆమే ఉంది..
సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ ---------- నాకు మొదట్నుంచీ ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చదివితే ఓ లాగా అనిపిస్తాయి......కలిపి చదివితే---- సురారులు అంటే రాక్షసులు..వారి తల్లి దితి...వీళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు,బాధ....మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపారడి తీర్చింది మన అమ్మలగన్నయమ్మ(ఆఱడి అంటే గాయం,బాధ....పుచ్చుట అంటే మాన్పటం).............
విడదీసి చదివితే------సురారులమ్మ----ఆ తల్లి దేవతలకే కాదు,రాక్షసులకీ తల్లే....మంచివాళ్ళకీ,చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా!!.....కడుపాఱడి పుచ్చినయమ్మ----మనకి ఏ బాధ వచ్చినా,కష్టమొచ్చినా తీర్చేది ఆ అమ్మేకదా (శ్యామశాస్త్రుల వారి కడుపు బాధ కూడా)...
తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ----- వేల్పుటమ్మల అంటే సర్వదేవతామూర్తులయందు నిలిచిఉండెడిదని.....తనని లోనుగా తలచిన వారికి మనసులోనే నిలిచిఉంటుందని అర్థం.....
కృపాబ్ధియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్------అలాంటి అమ్మవు, మాయమ్మవు, సముద్రమంత కృపతో మాకు సర్వసంపదల్నీ (అంటే ధనమే కాదు,విద్యనీ,కవితా శక్తినీ,ఆయురారోగ్యాల్నీ) ప్రసాదించు తల్లీ!!!

Tuesday 11 August 2015

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

ౠణ విమోచన అంగారక స్తోత్రం


గీతా సారము శాంతికి మార్గం


Tuesday 4 August 2015

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |
ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |
ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |
విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం |
పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 |
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |
|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||

ఆషాఢమాసం విశిష్టత


ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ/వ్రతం/పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.
ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.
తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.
అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.
కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.
ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా, కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.
శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే..!?

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.
మీ ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి బొమ్మను ఉంచాలంటే..?
•తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
•దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
•పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
•ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
•ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

Saturday 1 August 2015

శనేశ్వరమూర్తి కొలువుదీరిన "శని శింగణాపూర్"

శింగణాపురం గ్రామంలో సర్వం శ్రీ శనేశ్వరుడే. మహారాష్టల్రో వున్న శింగణాపురం గ్రామంలో శ్రీ శనేశ్వరుడు కొలువై ఉండటం వల్ల ఆ గ్రామం శని శింగణాపురంగా ప్రసిద్ధిగాంచింది. అక్కడ కొలువై వున్న శనేశ్వరునికి దేశవిదేశాలనుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకోవటంతో నేడు పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతుంది.
శని శింగణాపురంకు తానే రక్షకునిగా ఉంటానని స్వామి ఆ గ్రామ ప్రజలకు అభయం ఇచ్చాడు. అందువల్ల శని సింగణాపురం గ్రామంలో ఉన్న ఇళ్ళకు, దుకాణాలకు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు తలుపులు, తాళాలు ఉండవు. కేవలం పరదాలు మాత్రమే ఉంటాయి. చివరికి వస్తుసామగ్రిని కూడ శనేశ్వరుడే కాపాడుతాడని ఆ గ్రామ ప్రజల విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచి పోలీస్‌స్టేషన్ ఉన్నా ఓ కేసు కూడ నమోదు కాలేదు. గ్రామంలో కొలువుదీరిన శనేశ్వరుని స్వామిపైనే భారం వుంచి ప్రజలు తలుపులు, తాళాలు, కిటికీలు లేకుండా జీవిస్తున్నారు.
350 సంవత్సరాల క్రితం క్షేత్రంలో కొలువుదీరిన శనేశ్వరమూర్తి శింగణాపురంలో వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆనాడు ఈ గ్రామం చాలా చిన్నది. గ్రామానికి సమీపంలోని పణసవంకకు భారీగా వరద వచ్చింది. వరద తగ్గిన తరువాత నేరేడు చెట్ల మధ్య ఇరుక్కుని వున్న నల్లరాయిని గొర్రెల కాపరులు చూశారు. చేతిలో వున్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా వున్న కర్రతో రాయిని గుచ్చటం జరిగింది. గుచ్చిన ప్రాంతం నుంచి రక్తం రావటంతో భయంతో గొర్రెల కాపరులు గ్రామానికి పరుగులు తీసి తాము చూసిన సంఘటనను ప్రజలకు వివరించారు. ప్రజలు వచ్చి గొర్రెల కాపరులు చెప్పిన నల్ల రాయిని, కారుతున్న రక్తపుదారలను చూశారు. చెట్లుమధ్య వున్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకొనివెళ్ళటానికి విశ్వప్రయత్నాలు చేసారు. నల్లని రాయి కదల లేదు. ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళారు.
అదేరోజు రాత్రి గ్రామంలో వున్న వ్యక్తికి స్వామి కలలోకి వచ్చి తాను శనేశ్వరుడనని మామ, అల్లుడు వరస కలిగినవారు, మామ, అల్లునికి చెందిన నల్లని ఎద్దులు తీసుకొని వచ్చి మూర్తిని గ్రామానికి తీసుకొని వెళ్ళాలని చెప్పిన శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని, ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల, దోంగల, దోపిడిదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట.గ్రామ ప్రజలు స్వామి కలలో చెప్పిన ఆజ్ఞమేరకు నల్లని రాయిని మామ, అల్లుడు కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొని వచ్చి ప్రతిష్టించినట్లు స్థల పురాణం.
5.6 అడుగులు పొడవూ, 1.6 అడుగుల వెడల్పు కలిగివున్న ఈ మూర్తినే కట్టపై ప్రతిష్ఠించి శనేశ్వరునిగా పూజలు చేస్తున్నారు. శనీశ్వరమూర్తిని ప్రతిష్ఠించారు. కాని శనేశ్వరునికి గుడి లేదు. ప్రతిష్ఠించిన మూర్తి ఎంత వాన, గాలి, రాత్రిపగలు చలి వేడి అన్నింటినీ చవిచూస్తూ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. అయ్యప్ప మాలను ధరించినవారికి ఎలాగైతే శనిదోషం పరి హారం అవుతుందో అలాగే శింగణా పురం శనేశ్వరుడిని దర్శించుకున్నవారికి శని దోషం పరిహారమ వుతుందని భక్తుల నమ్మకం.
శనేశ్వరమూర్తి శింగణాపురంలో నేటికీ, (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు, ఇళ్ళకు, ఆలయాలకు, చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు!!!. ఈ వూళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల లేకపోవడం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. శనీశ్వరుడి నిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శింగణాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు.