Friday 29 April 2016

భూమి గుండ్రంగా ఉన్నదని మొట్టమొదట చెప్పినది ఎవరు..?

మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని మొట్టమొదట చెప్పినది ఎవరు..?
మనం చదువుకున్న చరిత్ర ప్రకారం 16,17 శతాబ్దాలకు చెందిన
కెప్లర్ , కోపర్నికస్, గెలీలియోలని.
కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి.
" చక్రాణాసః పరీణహం పృథివ్యా...."అర్థం "
అంటే భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు..."
అతిప్రాచీన గ్రంథం అయిన " సూర్యసిద్దాంతం " 12వ అధ్యాయం,32వ శ్లోకంలో
"మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి"
"బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది"... అని దాని అర్థం.
ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం
" భూగోళః సర్వతో వృత్తః" ..అంటే
భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.
క్రీ.శ.505 లో వరాహమిహిరుడు
" పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః..(13-1)"
అంటే .... పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,
పంజరం లో వేలాడే ఇనుప బంతిలా,
ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది"అన్నాడు.
" లీలావతి " గ్రంథం లో భాస్కరాచార్యుడు
" నీవు చూసేదంతా నిజం కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి
అందులో నాల్గవ భాగం చూస్తే
అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.
కానీ నిజానికి అది వృత్తమే.
అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."

No comments:

Post a Comment