Tuesday 29 March 2016

లక్ష్మీ కటాక్షం కోసం

లక్ష్మీ కటాక్షం కోసం భక్తులు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే లక్ష్మీదేవిని ఏ తిథులలో ఎటువంటి అభిషేకం చేయాలి? వారం రోజులలో లక్ష్మీదేవికి ఏ ప్రసాదం పెట్టాలి? అని చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం …
S.No ఏ తిథి అభిషేకం
1పాడ్యమి ఆవు నేయితో అభిషేకం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి.
2విదియ  చెక్కరతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది.
3తదియ  ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే ఎలాంటి అకాలమృత్యు దోషాలు తొలగిపోతాయి.
4చవితి   పిండివంటల నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు సంప్రాప్తిస్తాయి.
5పంచమ   అరటిపళ్ళు నైవేద్యం నివేదించడం వలన మేథస్సు, బుద్ధిశక్తి దిగ్వినీకృతం అవుతుంది (పెరుగుతుంది).
6షష్ఠి      తేనెతో అభిషేకించి చేసినట్లయితే, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది.
7అష్టమి బెల్లం నీళ్ళతో అభిషేకించి, శుద్ధి బెల్ల్లం ఎవరికయినా దానం ఇవ్వడం వలన అష్టకష్టాలు తీరిపోయి సుఖంగా ఉంటారు.
8నవమి  పేలాలు నైవేద్యం నివేదించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
9దశమి      నల్లనువ్వులతో చేసిన పదార్థాలు నైవేద్యంగా నివేదించినట్లయితే సకల రోగాలు తొలగిపోయి దీర్ఘాయుష్మంతులు అవుతారు.
          
    వారంలో అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం నివేదించాలి 
S.NO   వారం  నైవేద్యం 
1ఆదివారం   పాలు
2సోమవారం పాయసం
3మంగళవారం    అరటిపళ్ళు
4బుధవారం     వెన్న
5గురువారం  పటికబెల్లం
6శుక్రవారం   తీయని పదార్థాలు
7శనివారం    ఆవునెయ్యి  
  
     

No comments:

Post a Comment