Saturday 26 March 2016

జ్యోతిష ప్రయోజనం.......!!


మనిషికి తెలిసిన అన్ని శాస్త్రాలలోకి జ్యోతిషం గొప్పది. పుట్టిన తేది, సమయం, ప్రదేశం- ఈ మూడిటిని బట్టి మనిషి వ్యక్తిత్వం, జీవితం లో జరుగబోయే సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు ఏ ఇతర సైన్సు చెప్పలేదు. జీవితంలో ఎన్ని సాధించినా మనిషికి తెలియంది భవిష్యత్తు మాత్రమె. దానిని స్పష్టంగా చూపించే విద్య జ్యోతిషం.
జరిగేది ఎలాగూ జరుగుతుంది, జ్యోతిషం ఎందుకు అన్న ప్రశ్న ఈ నాటిది కాదు. చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది. భట్టోత్పలుడు వరాహుని గ్రంధాలకు, పృధు యశస్సు గ్రంధాలకు వ్యాఖ్యాత. ఈయన ఈ విషయాన్ని వివరంగా చర్చించాడు. ముందు జరుగ బోయేవి తెలుసుకుంటే మార్చుకునే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అసలు జ్యోతిష ప్రయోజనం జరుగబోయే చెడును తొలగించుకోడమే. దానికి అవకాశముందా అన్నది ప్రశ్న?
భవిష్యత్తును మార్చుకునే అవకాశం తప్పక ఉంది. అవకాశమే లేకుంటే జ్యోతిష విద్యకు అర్థమే లేదు. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మనం అనుభవించే మంచి, చెడు రెండూ మనము పూర్వ జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరియైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితం మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.
అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మన ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ మూడు రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించ గలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.
మనిషి జీవితంలో పశ్చాత్తాపానికి ఎప్పుడూ అవకాశం ఉంది. చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం భగవంతుని సృష్టిలో ఉంటుంది. అయితే రెమెడీస్ అనేవి తూతూ మంత్రంగా చేసి తరువాత మళ్ళీ మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అంటే కుదరదు. చిత్త శుద్ధితో, చేసిన పాపాలకు నిజమైన పశ్చాత్తాపం తో భగవంతుని వేడుకుంటూ రెమెడీస్ మనస్పూర్తిగా చేస్తే తప్పక అవి ఫలితాన్ని ఇస్తాయి. చాలా సార్లు ఫలితాలు వెంటనే కనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇది ఎన్నో సార్లు రుజువైంది.
కాకుంటే రెమెడీస్ చెయ్యడం చాలా కష్టం. తేలికగా కనిపించే రెమెడీస్ కూడా ఒక పట్టాన లొంగవు. చెయ్యటానికి బుద్ధి పుట్టదు. పుట్టినా అనేక అవాంతరాలు కలుగుతాయి. మధ్యలో మాని వేయాల్సిన పరిస్తితులు తలెత్తుతాయి. వీటన్నిటికీ తట్టుకొని నిర్ణీత కాలం వరకు చెయ్య గలిగితే తప్పక దోషాలు తోలగుతవి. జ్యోతిషం మణి, మంత్ర, ఔషదాలను రేమేడీలుగా సూచించింది. ఇవే గాక తాంత్రిక రేమేడీలు ఉన్నాయి. సులభంగా కనిపిస్తూ చేసేటప్పుడు నానా బాధలు పెట్టె లాల్ కితాబ్ రేమేడీలు ఉన్నవి.
జ్యోతిషం నిరాశావాదం కాదు. ఇది జీవితం మీద ఆశను పెంచే శాస్త్రం. రేమేడీల ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చు అనేది నిర్వివాదం. ఇదే జ్యోతిషం యొక్క అసలైన ప్రయోజనం.
పండుగలు
జ్యోతిషశాస్త్ర విజ్ఞానమును మనకిచ్చిన మహర్షుల ఉద్దేశ్యముజ్యోతిషశాస్త్ర విజ్ఞానమును మనకిచ్చిన మహర్షుల ఉద్దేశ్యము భవిష్యత్తును చూచి భయపడి పారిపోవటానికో దుఖి:స్తూ కృషించడానికి కాదు. భయంకరమైన నది లాంటి సంసారము లో ఈదే జీవులు ఇక్కడసుడిగుండాలున్నాయో, ఎక్కడ భయంకర కాలసర్పాలున్నాయో, ఏప్రాంతములో ఏసమయానికి మిమ్మల్నిమింగాలనిమొసల్లు కాచుకుని వుంటాయో తెలియజేయటము. తెలియటము ద్వారా భయపడటము కాక జాగ్రత్తలు తీసుకుని ఆప్రమాదాలనుంచి లేక ఇబ్బందులనుంచి తెలివిగా తప్పుకుని సాగిపోవటమే వారు కరుణతో మనకందించిన ఈవిద్య లక్ష్యము. ఈ ప్రయాణము ఆపుదామన్నా ఆగేది కాదు,దాని సమయము పూర్తయినదాకా. కనుక నదిని ఈది దాటటము ప్రమాదకరము,కష్టతరము. కాని నదిని ఈదక తప్పదు. మొండిగా ఈదుతానిని దిగి కొందరు అలసి సొలసి ఈదితే, ఈలోపలకొందరు అంతమయ్యేదికూడా మధ్యలో జరుగుతుంది.
తెలివి అదృష్టవంతుడు ఒక చెక్కనో దుంగనో ఆధారము చేసుకుని ఈదుతూ తన శ్రమను కొద్దిగా తగ్గించుకుంటాడు. తెలివి కలవాడు ఒక పడవను తయారు చేసుకుని దానిని నడుపుకుంటూ ప్రమాదాలు దాటుకుంటూ వెళతాడు. భగవన్నామము అను ఓడను ఎక్కిన వాడు పూర్ణవిశ్వాసముతో నిశ్చితముగా, హాయిగా , విశ్రాంతిగా , సునాయాసముగా ఈనదిని తరిస్తాడు.
ఈఈ ప్రమాదాలు ,గండాల గుండాలు ఎక్కడున్నాయో ప్రయాణముళో ఏసమయానికి మీకెదురవుతాయో తెలియజేసే స్పష్టమైన మ్యాపు జ్యోతిష్యము మనకిస్తుంది. దానిని చూసి భయపడి ప్రయాణము చేసినంతసేపు ఏడవడము కాదు.వివరాలు తెలిసాయికదా అన్న ధైర్యముతో సాగాలి.
ఆవిద్యను కూడా మనకిచ్చారా మహానుభావులు. అసలు మనిషి జీవిత విధానము ఈ ప్రకృతి లో ఏశక్తులు నియంత్రిస్తున్నాయో పరిశోధించి దర్శించి వాటి పరిష్కార మార్గాలను కూడా ఇచ్చారు.ఇంకా ఈప్రాకృతికశక్తులన్నీ ఏ దివ్య చైతన్యము ద్వారా నియమాత్మకముగా నడప బడుతున్నాయో ఆ పరాశక్తి ని ఆశ్రయిస్తే ,ఆశక్తితో మమేకమైతే ఇక సృష్టిలో ఎవరికీ భయపడవలసిన అవసరము లేదనే సత్యాన్నివారు కరుణతో మనకు బోధించారు. ఈపుణ్యభూమిలో మాత్రమే లభించినది ఈదివ్య విద్య.
ఇక మనకు ఈమధ్య ఆరోగ్య సృహ బాగాపెరిగినది. వ్యాధి రాకముందే అనేక రకాల వైద్య పరీక్షలు చేపించు కుంటున్నాము. అక్కద అన్ని పరీక్షలు చేసి వైద్యులు నాయనా ! నువ్వు ఈనూనెలు ఎక్కువ వాడితే నీకు గుండెపోటు రావచ్చు. నీ శరీరములో ఫలానా పదార్ధము ఎక్కువవుతున్నది దీనిద్వారా ఫలానా వ్యాధి వచ్చేఅవకాశమున్నది అని హెచ్చరిస్తే మనమేమి చేస్తాము. ఏడుస్తూ నాకావ్యాధి వచ్చేస్తున్నది అని తిండితిప్పలు మాని కూర్చుంటామా? లేదే! దానికి తగు జాగ్రత్తలు తీసుకుని రాబోయేప్రమాదాలనుంచి తప్పించుకుంటాము. ఎందుకండీ ఏపరీక్షలు లేనిపోనిది వల్లు చెప్పాక బాధపడాలి అని ఆపరీక్షలజోలి కెల్లకపోవటము మన ఇష్టాఇష్టాలకు సంబంధించినది. ఎక్కడో ఒక చోట కొందరు దుర్మార్గులైన వైద్యులు లేని రోగలక్షణాలను చెప్పి దోచుకునే వారుండవచ్చు,అంతమాత్రాన అది వైద్య విద్యకు సంబంధించిన లోపము కాదుకదా?
ఇక జ్యోతిష్యశాస్త్ర ఆధారముతో సమస్యలకు మూలాలను తెలుసుకుని. గురువులు ప్రసాదించిన భగవన్నామమనే సంజీవనిని అందిస్తున్నాం. ఆకలైన వారు కోసము వంటచేసుకునితినాలి. ఓపిక లేనప్పుడో, లేక చేతకానప్పుడో మనమేదో వండి పెడతాము కానీ తిని ఆకలి తీర్చు కోవలసిన పని వారికేసాద్యము,వారే ఆపనిచేయాలి.
ముందుగ నక్షత్రాలు, గ్రహాలు, రాశులు, లగ్నాలు మొదలైనవి నేర్చుకుందాం......
రాశులురాశులు 12...........
01. మేష రాశి
02. వృషభ రాశి
03. మిధున రాశి
04. కర్కాటక రాశి
05. సింహ రాశి.
06. కన్యా రాశి
07. తులా రాశి
08. వృశ్చిక రాశి
09. ధనుస్సు రాశి
10. మకర రాశి
11. కుంభ రాశి
12. మీన రాశి
గ్రహాలు...........
గ్రహాలు 9
1. సూర్యుడు
2. చంద్రుడు
3. అంగారకుడు
4. బుధుడు
5. బృహస్పతి
6. శుక్రుడు
7. శని
8. రాహువు
9. కేతువు
నక్షత్రాలు:నక్షత్రాలు 27.........
01. అశ్విని
02. భరణి
03. కృత్తిక
04. రోహిణి
05. మృగశిర
06. ఆరుద్ర
07. పునర్వసు
08. పుష్యమి
09. ఆశ్లేష
10. మఖ
11. పుబ్బ
12. ఉత్తర
13. హస్త
14. చిత్త
15. స్వాతి
16. విశాఖ
17. అనూరాధ
18. జ్యేష్ట
19. మూల
20. పూర్వాషాఢ
21. ఉత్తరాషాఢ
22. శ్రవణం
23. ధనిష్ట
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి
నక్షత్రములు - స్వభావములు.....
సవ్య నక్షత్రములు------
అశ్విని
పునర్వసు
హస్త
మూలభరణి
పుష్యమి
చిత్త
ఉత్తరాభాద్ర
పూర్వాభాద్ర
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
రేవతికృత్తిక
ఆశ్లేష
స్వాతి
అపసవ్య నక్షత్రాలు.....
రోహిణి
మఖ
విశాఖ
మృగశిర
పుబ్బ
అనూరాధ
శ్రవణం
ధనిష్ట
శతభిషం
ఆరుద్ర
ఉత్తర
జ్యేష్ట
పురుష నక్షత్రాలు........
అశ్విని
అనూరాధ
శ్రవణం
పుష్యమి
ఉత్తరాభాద్ర
పూర్వాభాద్ర
పునర్వసు
హస్త
స్త్రీ నక్షత్రాలు.....
భరణి
కృత్తిక
రోహిణి
ఆరుద్ర
ఆశ్లేష
మఖ
పుబ్బ
చిత్త
ఉత్తర
విశాఖ
స్వాతి
జ్యేష్ట
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
ధనిష్ట
రేవతి
పురుష నక్షత్రాలు......
ధృవ తారలు : ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి.
తీక్షణ తారలు : మూల, ఆరుద్ర, ఆశ్లేష, జ్యేష్ట.
ఉగ్ర తారలు : పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, మఖ.
క్షిప్ర తారలు : కృత్తిక, విశాఖ.
చరములు : శ్రవణము, ధనిష్ట, శతభిషము, పుఅర్వాసు, స్వాతి.
నక్షత్రములు - ఆధిపత్య గ్రహములు..... అశ్విని, మఖ, మూల---కేతువు
భరణి, పుబ్బ, పూర్వాషాఢ---శుక్రుడు
కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ---రవి
రోహిణి, హస్త, శ్రవణం---చంద్రుడు
మృగశిర, చిత్త, ధనిష్ట ----కుజుడు
ఆరుద్ర, స్వాతి, శతభిషం---రాహువు
పునర్వసు,విశాఖ,పూర్వాభాద్ర---గురువు
పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర---శని
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి---బుధుడు
రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్యరేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు అని అంటారు. అది సుమారుగా మార్చి 21వ తేదీన జరుగుతుంది. ఆరోజు భూమధ్య రేఖమీద పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా ధృవాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది . దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే రాశిచక్రం . దీన్ని ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. వసంత విషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిరబిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉన్నది. దాన్నే అయనాంశ అంటారు. అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త, కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు రాశిచక్రాలు అనుకోవచ్చు. సాయన రాశిచక్రం ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషానికి చెందినది. ఒకే వ్యక్తి యొక్క జాతకచక్రాన్ని ఈ రెండు రాశిచక్రాల ప్రకారం గుణిస్తే అసలు ఒకదానికీ మరొకదానికీ సామ్యమే ఉండదు. ఒక జాతకం ప్రకారం మేషంలో సూర్యుడుంటే, మరొక జాతకం ప్రకారం మీనంలో ఉంటాడు (భారతీయ, పాశ్చాత్య రాశిచక్రాల మధ్య 23 డిగ్రీల భేదం ఉంది కాబట్టి). అదే విధంగా భారతీయ జ్యోతిషంలో కూడా అయనాంశ భేదాల ప్రకారం అంత కాకపోయినా కొద్ది భేదంతో (ఒక డిగ్రీ సుమారు) రాశిచక్రాలు మారతాయి. నిరయణ సిద్ధాంతం ప్రకారం విషువములూ, అయనములూ ఋతువులని అనుసరించి రావు. భాగవత ప్రమాణం ఇలా ఉంటుంది - మేష తులలయందు మిహిరుండహో రాత్రు లందు తిరుగు సమ విహారములను. (పంచమ స్కంధం, ద్వితీయాశ్వాసం, 21వ అధ్యయం, 79వ పద్యం.) అంటే మేష, తులా సంక్రమణాల సమయంలో పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి అని. సాయన సిద్ధాంతం ప్రకారం మేష తులా సంక్రమణాలు వరుసగా మార్చి 21, సెప్టెంబరు 22న వస్తాయి. ఆ దినాల్లో భూమధ్యరేఖ పైన రాత్రీ, పగలూ సమానంగా ఉంటాయి. కానీ నిరయణమతం ప్రకారం మేష తులా సంక్రమణాలు ఏప్రిల్ 14, అక్టోబర్ 14 న వస్తాయి. ఆ రోజుల్లో పగలూ రాత్రీ సమానంగా ఉండవు.

No comments:

Post a Comment