Sunday 20 March 2016

సూర్యభగవానుడు

సకల అనారోగ్య వాస్తుదోష నివారణకు "పంచధాతు సూర్యభగవానుడు"
పంచలోహలతో ఉన్న సూర్యభగవానుడి రూపాన్ని ప్రధాన సింహాద్వారానికి తగిలించిన లేదా తూర్పు దిక్కున ఉంచిన సకల వాస్తుదోషాలు నివారణ అగుటయేగాక దీర్ఘకాల అనారోగ్యాలు సైతం నయమవుతాయి.
ప్రతిరోజూ ఆకాశంలో ఉదయించే సూర్యుడిని మునులు, రుషులు, పండితులు చాలామంది అర్చిస్తుంటారు. వీరేకాక దేవతలు, సిద్ధులు, చారణులులాంటివారు కూడా నిత్యం ఆయన్ను ఆరాధిస్తూనే ఉంటారు. దీనికి కారణం ఏమిటి? అనే విషయం పూర్వం వైశంపాయనుడికి కలిగింది. ఆ సందేహాలను తీరుస్తూ వ్యాసమహర్షి సూర్యభగవానుడి మాహాత్మ్యాన్ని పేర్కొన్న కథాసందర్భం పద్మపురాణంలో మనకు కనిపిస్తుంది.
సూర్యుడు బ్రహ్మస్వరూపం నుంచి ప్రకటితమయ్యాడు. ఆయన బ్రహ్మ తేజోరూపుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మమే ఆయన. ఆ భగవానుడు ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలను తనను అర్చించినవారికి ప్రసాదిస్తాడు. సర్వలోకాల ఉత్పత్తి, పాలన ఈయన రూపంగానే జరుగుతుంటుంది. లోకాలన్నిటికీ రక్షకుడు కూడా సూర్యభగవానుడే. ఈ భగవానుడిని ఆరాధిస్తే దేవతలందరినీ ఆరాధించినట్లే లెక్క. సూర్య మండలంలో ఉన్న సంధ్యాదేవిని ఉపాసించి స్వర్గాన్ని, మోక్షాన్ని ఎందరెందరో పొందుతూ ఉంటారు.
రోగాల నుంచీ విముక్తి..
సూర్యోపాసనవల్ల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. అంధత్వం, దారిద్య్రం, దుఃఖం అనే వాటి నుంచి తన భక్తులను సూర్యుడు తప్పిస్తుంటాడు. సూర్యభగవానుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి ప్రతిరూపమే. అందుకే ఆయనకు సూర్యనారాయణుడు అనే పేరు వచ్చింది. ఇంతటి సూర్య భగవానుడికి నిత్యం దోవ చూపిస్తూ ఉంటుంది సూర్యుడి భక్తురాలైన ఉషాసుందరి. ఈమె రాత్రికి అక్క, ఆకాశానికి కూతురు, వరుణదేవుడికి చెల్లెలు. కాంతులను విరజిమ్ముతూ నిత్యం యువతిలా శోభిల్లుతూ ఉంటుంది. ఈ ఉష సకల జంతుజాలానికి చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈమె ముందుగా చూపించిన మార్గంలో సూర్యభగవానుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ జగత్తులో జరిగే సంఘటలన్నీ సూర్యభగవానుడి లీలా విలాసాలే. సూర్యుడిని అంతా ఆరాధించటంలో మరో మహత్తర విషయం కూడా ఉంది. ఆయన ప్రాతఃకాల సమయంలో బ్రహ్మదేవుడిలా ప్రకృతి అంతటా జీవాన్ని నింపుతుంటాడు. మధ్యాహ్న వేళల్లో మహేశ్వరుడిలా తమోగుణ లీలలను ప్రదర్శిస్తుంటాడు. రుద్రుడిలా ప్రకృతి రజోగుణాన్ని శుష్కింపచేస్తుంటాడు. ఇలా దినమంతా ఆ దినకరుడు ప్రకృతికి చేసే మేలు ఇంతా అంతా కాదు.
సూర్యుడు కేవలం ఒక్కడుగా కాక పన్నెండు రూపాలుగా అంటే ద్వాదశాదిత్యులుగా ఉండటం విశేషం. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనేవారే ద్వాదశాదిత్యులు. సూర్యభగవానుడు నిజంగా అంత మేలు చేస్తాడు. తనను ఉపాసించినవారికి కొంగుబంగారమై ఆదుకుంటాడు

No comments:

Post a Comment