Monday 9 May 2016

వ్యవసాయ జ్యోతిష్యంలో మేషాది పన్నెండు రాసులు ప్రాముఖ్యత ఎంతో ఉంది.


మేషం ; ఉల్లిపాయ మరియు ఉల్లి వలె వాసన వచ్చే ఉడుపు మొక్కలు పాతుటకు విత్తనాలు చల్లుటకు ఉత్తమం.
వృషభం ; ముల్లంగిదుంప,క్యారెట్,బీట్రూట్,చిలకడదుంప మొదలగు పంటలు వేయటానికి మంచిది.
మిధునం; పచ్చిక గడ్డి కోయుటకు పొలం దున్నుటకుచాలమంచిది.
కర్కాటకం ; పండ్ల మొక్కలకు,తోటలకు ప్రత్యేకమైన రాశి కర్కాటకం.పండ్ల విత్తనాలు నాటుటకు
పండ్లమొక్కలు ఒక చోట నుండి పెకలించి మరొక చోట పాతుటకు చాలా మంచిది.
సింహం ; విత్తనాలు చల్లుతకు కానీ మొక్కలు ఒక చోట పెకలించి మరొక చోట పాతుటకు మంచిది కాదు.
కన్య ; పొలం దున్నుటకు,కలుపు మొక్కలు తీయుటకు కన్య రాశిచాలమంచిది.
తుల ; పండ్ల,పూల మొక్కలు నాటుటకు,విత్తనాలు చల్లుటకు చాల మంచిది.
వృశ్చికం ; పండ్ల మొక్కలకు మంచిది.పండ్ల,దుంప విత్తనాలకు మంచిది.
ధనుస్సు ; ఉల్లిపాయ పంటకు అన్ని రకాల పంటలు వేయటానికి చాలమంచిది.
మకరం ; దుంప పంటలకు మంచిది.
కుంభం ; పొలం దున్నుటకు,కలుపు మొక్కలు తీయుటకు చాలమంచిది.
మీనం ; పలుచని పండ్ల మొక్కల పంటలకు,అన్నిరకాల పండ్ల పంటలకు చాల మంచిది.
ముఖ్యంగా ఆదివారం ఏ మొక్కలు అయిన సరే వ్రేళ్ళతో సహా పీకి మరొక చోట నాటకూడదు.అల చేస్తే మొక్కలు చనిపోతాయీ.
పుష్యమి నక్షత్రంలో ఏ మొక్క నాటిన బాగుగ పెరుగును.

No comments:

Post a Comment